అత్యంత పౌష్టికాహారం మెలకల కిచిడీ..

Nutritious Sprouts Khichidi
సాధారణంగా కొన్ని ధాన్యాలను ఉడికించి తీసుకోవడం కంటే మెలకెత్తించి వాటిని అలాగే తినడం లేదా వాటితో ఏవైనా వెరైటీలు చేసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు నష్టకాకుండా ఉంటాయి. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మంచివి అంటారు. వాటిని తినండి. అంటే పిల్లలు సామాన్యంగా ఇష్టపడరు. అప్పుడప్పుడు ఇలా కిచిడీ లాగ చేస్తే చాల నచ్చుతుంది. ఏ రైతానో, కుర్మానో జత చేసామంటే అసలు పేచీ ఉండదు. పెసలు, శనగలు, పల్లీలు, చోలే ఇలా ఏవైనా వేసి చేయొచ్చు..

కావలసిన పదార్ధాలు :
బియ్యం: 1cup
మెలకెత్తిన గింజలు: 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి : 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
పుదీనా ఆకులు: 10
కొత్తిమీర : కొంచెం
టమాటా: 2
క్యారెట్ తురుము: 1cup
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2tbsp
గరంమసాల పొడి: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
పసుపు : 1/4tsp
నూనె: 3tbsp
నెయ్యి : 2tbsp
పోపుకు: మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి

తయారు చేయు విధానం :
1. ముందుగా బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి. (రెండు రోజుల ముందుగా పెసలు, శనగలు, పల్లీలు, చోలే, అలసందలు వంటివి ఒక రోజంతా నానబెట్టి తర్వాత నీరు వంపేసి కాటన్ బట్టలో ముడికట్టి మెలకొచ్చే వరకూ గట్టిగా కట్టి పెట్టాలి. ఇలా తయారైనవే మెలకలు).
2. తర్వాత ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేడిచేసి అందులో పోపుకు తయారు చేసి పెట్టుకున్న వాటిని వేసి, పోపు వేగాక, కరివేపాకు, ఉల్లిపాయ మిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. మిరియాలు,జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే స్పైసీగా రుచి బావుంటుంది.
3. ఇప్పుడు తరిగిన పుదీనా, కొత్తిమీర, కారట్ తురుము, టమాటా వేసి వేగిన తరువాత పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలపొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి.
3. చివరిగా మొలకెత్తిన గింజలు ,బియ్యం వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఏదైనా రైతా, కుర్మా తో వేడివేడిగా వడ్డిస్తే మొలకల కిచిడీ రుచిగా నోరూరిస్తుంది.

Story first published: Wednesday, June 20, 2012, 12:42 [IST]
Desktop Bottom Promotion