Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
పూరీ సాగు బహుల రుచి గల బ్రేక్ ఫాస్ట్

గోధుమ పిండి లేదా మైదా: 2cups
నూనె: 2tsp
నీళ్ళు : తగినంత
ఉప్పు: రుచికి తగినంత
పూరీ వేయించుకోవడానికి నూనె: కావలసినంత
పూరీ తయారు చేయు విధానం:
1. ఉప్పు, నూనే, నీళ్ళు, పూరీ పిండిలో కలిపి చపాతిపిండిలా మృధువుగా కలుపుకోవాలి.
2. ఒక గంట తరువాత పూరీలను గుండ్రంగా వత్తుకొని కాగిన నూనేలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాలిన తర్వత పక్కకు తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అందుకు ముందుగానే పూరి సాగు రెడీ చేసుకోవాలి. సాగు తయారు చేయడం ఎలాగంటే...
సాగు కావలసిన పదార్థాలు:
మిక్డ్స్ వెజిటేబుల్స్: 2cups(బీన్స్, క్యారెట్, బంగాళదుంప, బఠానీ)
ఉల్లిపాయ: 1( కట్ చేసినవి)
టమోటో: 1 ( కట్ చేసినవి)
ఆవాలు: 1/2tsp
నూనె : 2tbsp
కొత్తిమీర తరుగు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మసాలాకు కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 1/2cuూ
చిన్న ఉల్లిపాయలు: కొద్దిగా
జీలకర్ర: 1tsp
ధనియాలు: 2tsp
గసగసాలు: 1tsp
శెనగపప్పు(పుట్నాలు): 1tsp ( వేయించిన పుట్నాలు)
పచ్చిమిర్చి : 5-6
చింత పులుసు: 1tsp
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
పసుపు: 1/4tsp
కొత్తిమీర తరుగు: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మసాలాకు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో ఆవాలు, వేసి అవి చిటపట అన్న తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
3. తర్వాత అందులో టోమాటో ముక్కలు కూడా వేసి అది కాస్త వుడికినతరువాత తరిగివుంచిన కూరగాయలన్నీ అందులోవేసి 5-10నిమిషాల పాటు వుడికించుకోవాలి.
4. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాల ముద్దను ఉడుకుతున్న కూరగాయలలో వేసి, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు పోసి మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే వేడి, వేడిగా పూరీ సాగుతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











