Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
బ్రింజాల్(వంకాయ)రైస్-సౌంత్ ఇడియన్ స్పెషల్

ముఖ్యంగా బియ్యం, వంకాయ, మసాలా దినుసులు ఈ వంటకానికి కావల్సిన పదార్థాలు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గాను, మధ్యహాన భోజనంగాను తీసుకోవచ్చు.
బియ్యం: 250 grams (నెయ్యివేసి ఉడికించిన అన్నం)
వంకాయలు: 100 grams (sliced)
ఆవాలు: 1/2 tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
శెనగపప్పు: 1tbsp
నిమ్మరసం: 1tbsp
వేయించిన పల్లీలు: 10
పసుపు: 1 pinch
ఇంగువ: 1 pinch
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పేస్ట్ తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు
ఎండుమిర్చి: 3
ధనియాలు: 1tsp
గసగసాలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
నువ్వులు: 1/2 tsp
చెక్క: 1 inch
లవంగాలు: 2
కొబ్బరి తురుము: 1/2 cup
ఉద్దిపప్పు: 1tbsp
కందిపప్పు: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యంకు సరిపడా నీరుపోసి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నేయ్యి వేసి అన్నం వండి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, అందులో జీలకర్ర, లవంగాలు, చెక్క, ఎండు మిర్చి వేసి లైట్ గా వేగించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అందులోనే ఒక చెంచా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉద్దిపప్పు, కందిపప్పు వేసి మరో నిముషం పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.
4. అలాగే అదే పాన్ లో గసగసాలు, నువ్వులు మరియు కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా నూనెలో వేయించి పెట్టుకొన్న మసాలా దినుసులు, తర్వాత ఫ్రై చేసి పెట్టుకొన్న పోపు దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.
6. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం వేయించాలి. అందులోనే శెనగపప్పు వేసి వేగించి అందులోనే పసుపు, ఇంగువను చిలకరించి ఫ్రై చేయాలి.
7. ఇప్పుడు అందులో వంకాయ ముక్కలను వేసి, ఉప్పు చల్లి 5-10నిముషాల పాటు వేగించాలి. వంకాయలు కొద్దిగా వేగిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలాను అందులో వేసి మరో 5నిముషాలు వేయించాలి.
8. వంకాయ మెత్తబడ్డాక అందులో ముందుగా వండిపెట్టుకొన్న అన్నం కలిపి మరో రెండు మూడు నిముషాలు వేయించి సర్వ్ చేయాలి. అంతే వాంగీ బాత్ రెడీ.



Click it and Unblock the Notifications