Latest Updates
-
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
కోరి వచ్చిన ఊర్వశిని అర్జునుడు ఎందుకు కాదన్నాడో తెలుసా?
ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది. నన్ను ఇప్పటి వరకు ఇలా అవమానపరిచిన వాళ్లు ఎవరూ లేరు అని బాధపడింది. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను.కోరి వచ్చిన ఊర్వశిని అర్జునుడు ఎందుకు కాదన్నాడో తెలుసా?
ఊర్వశి మహా అందెగత్తె. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావల్సిందే. అయితే అర్జునుడిని శివుడు పరీక్షించాలనుకుంటాడు. అర్జునుడి విద్యలను మొత్తం కూడా శివుడు కిరాతుకుడి రూపంలోకి మారి పరీక్షిస్తాడు. అందులో అర్జునుడు నెగ్గుతాడు. తర్వాత అర్జునుడిని ప్రశంసిస్తూ ఇంద్రలోకంలోని దేవతలు కూడా ఆయనకు ఎంతో విలువైన అస్త్రాలు ఇచ్చేందుకు అర్జునుడుని స్వర్గలోకానికి ఆహ్వానిస్తారు.

ఊర్వశి నాట్యాన్ని చూసి మైమరిచిపోతాడు
స్వర్గంలో అర్జునుడికి అందరూ ఎంతో మర్యాదగా స్వాగతం పలుకుతారు. తర్వాత అర్జునుడిని వినోదపరిచేందుకు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. రంభ, మేనక, ఊర్వశి, అప్సరసలంతా కలిసి నాట్యం చేసి అర్జునుడిని సంతోషపరుస్తారు. రెప్పార్పకుండా అర్జునుడు ఆ నాట్యాలను చూస్తాడు. అయితే ఊర్వశి నాట్యాన్ని చూసి మైమరిచిపోతాడు.

అర్జునుడు మోజుపడినట్లున్నాడు
ఊర్వశి తాను నాట్యం చేస్తున్నంత సేపు అర్జునుడినే గమనిస్తూ ఉంటుంది. అర్జునుడు నాపై మోజుపడినట్లున్నాడు.. అందుకే నన్ను తదేకంగా చూస్తూ ఉన్నాడనుకుంటుంది. సరే నాట్యం అయిపోయాక తన పరువాలు మొత్తం అర్జునుడికి సమర్పించి ఆనందింపచేద్దామనుకుంది.

నువ్వు నా వంకే చూస్తున్నావు
నాట్యం అయిపోయాక అర్జునుడు వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అక్కడికి ఊర్వశి వెళ్తుంది. ఊర్వశి రాగానే పడుకున్న అర్జునుడు వెంటనే లేచి కూర్చొంటాడు. మీరు ఏంటి ఇలా వచ్చారని అడుగుతాడు అర్జునుడు. "అర్జునా... నేను నాట్యం చేస్తున్నప్పుడు నువ్వు నా వంకే చూస్తున్నావు.
నేను గమనించాను. " అని అంటుంది ఊర్వశి.

నువ్వు నాకు నచ్చావు
"నేను నీకు బాగా నచ్చినట్లున్నాను. నువ్వు కూడా నాకు బాగా నచ్చావ్. నీ గురించి నేను విన్నాను. నువ్వు ఎంతో ధైర్యవంతుడివి అని, అస్త్ర విద్యల్లో నిన్ను మించి మగాడులేడని నేను విన్నాను. అందుకే నువ్వు నాకు నచ్చావు.
నేను ఇప్పుడు నిన్ను డైరెక్ట్ గా చూస్తున్నాను. నిజంగా నువ్వు నన్ను మాయలో పడేశావు. నేను నీతో గడిపాలనుకుంటున్నాను. నిన్ను సంతోషపెట్టానుకుంటున్నాను" అని అంటుంది ఊర్వశి.

మీ భర్త పురూరవుడు మా వంశస్తుడే
ఆ మాటలు విన్న అర్జునుడు ఆశ్చర్యపోతాడు. "అమ్మా.. నువ్వేనా ఈ మాటలు అంటుంది. నువ్వు నాకు తల్లిలాంటి దానివి. నీపై నేను మోజుపడడం ఏమిటమ్మా. మీ భర్త పురూరవుడు మా వంశస్తుడే. అంటే మీరు నాకు తల్లితో సమానం. అలాగే ఇంద్రుడికి కూడా మీరు ఎంతో నచ్చినవారు. అలాంటి నీతో నేను ఎలా కామ సుఖం పొందగలనమ్మా. " అని అర్జునుడు అంటాడు.

ఆ మాటలు ఊర్వశికి కోపం తెప్పించాయి
నేను నిన్ను మోహించలేదు. అలా ఎప్పటికీ చెయ్యను. కేవలం నీ నాట్యాన్ని చూసి మాత్రమే నన్ను నేను మైమరిచిపోయాను. నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. సరే తల్లి నువ్వు వెళ్లి పడుకోపో అని అర్జునుడు అంటాడు. అయితే ఆ మాటలు ఊర్వశికి కోపం తెప్పించాయి.

అహం దెబ్బతింది
కోరి వస్తే నన్నే తిరస్కరిస్తాడా? అని ఆమె అహం దెబ్బతింది.
ఆమె కోపంతో రగిలిపోయింది. సరే అర్జునుడికి అసలు మ్యాటర్ అర్థం కావడం లేదని అతనికి దగ్గరకు మళ్లీ వెళ్లి.. ఇది దేవలోకం ఇక్కడ అలాంటి నీతులు ఏమి ఉండవని చెప్పింది. అప్సరసల బాధ్యత ఆనందింప చేయడమేనని చెబుతుంది. అయినా అర్జునుడు రెండు చేతులు జోడించి మొక్కి వెళ్లిపో అంటాడు.

ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది
ఇక ఊర్వశికి కోపం కట్టలు తెచ్చుకుంది. నన్ను ఇప్పటి వరకు ఇలా అవమానపరిచిన వాళ్లు ఎవరూ లేరు అని బాధపడింది. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను... కోరి వచ్చిన అందాన్ని కాదన్నావు కాబట్టి నీ జీవితంలో నువ్వు కొన్ని రోజులు నపుంసకుడిగా ఉండాలి అని శపిస్తుంది.

శాపమే వరం అయ్యింది
నీ ధైర్యపరాక్రమాలన్నీ పోయి నువ్వు ఆడవారితో ఉండాల్సి వస్తుందని శపిస్తుంది. దీంతో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు బృహన్న మాదిరిగా మారిపోవాల్సి వస్తుంది. బృహన్న మాదిరిగా అర్జునుడు సంవత్సరం పాటు గడుపుతాడు. అయితే అర్జునుడికి ఆ శాపం కూడా అజ్ఞాతవాసంలో వరం అయ్యింది.



Click it and Unblock the Notifications











