Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
శివుడు స్మశానంలోనే ఎందుకు వుంటాడో తెలుసా..?
చాలా మంది దేవుళ్లు వైకుంఠం, సముద్రం, స్వర్గం, ఇలాంటి ప్రదేశాల్లో వుంటారు. కానీ శివుడు మాత్రం స్మశానంలో వుంటాడు. మనుషులు చనిపోయిన తరువాత ఆ మృతదేహాన్ని స్మశానంలో పాతిపెట్టడం, లేదా కాల్చివేయడం చేస్తారు. ఉదయం ఆ ప్రదేశంలోకి ఎవ్వరూ వెళ్లరు. ఇక రాత్రుళ్లైతే చాలా భయానకంగా వుంటుంది. ఎన్నో మంచి ప్రదేశాలను వదులుకొని శివుడు ఎందుకు స్మశానంలో వుంటాడో మీకు తెలియజేస్తున్నాం.
మహాభారత అనుశాసన పర్వం 141 వ అధ్యాయంలో దీని గురించి వర్ణించబడి వుంది. ఎన్నో మంచి ప్రదేశాలు వదిలి స్మాశానంలో నివసించడానికి కారణమేంటని శివుని భార్య ఉమాదేవి ప్రశ్నిస్తుంది. అపవిత్ర స్థానంలో ఎందుకు వుంటున్నారని అడుగుతుంది. దానికి ఆ మహాదేవుడు.. దేవీ, నేను రాత్రీ పగలు ఈ భూమిమీద పవిత్ర స్థలం ఎక్కడ వున్నదా అని వెతుకుతూ వుంటాను. ఈ స్మశానానికి మించిన మంచి ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించడం లేదు. అందుకే ఈ స్మశానంలోనే నివాసం వుంటున్నాను. నా భూత గణాలు ఎక్కడే వుంటాయ్. కాబట్టి నాకు ఈ ప్రదేశమంటేనే ఇష్టమని శివుడు అంటాడు.

ఇది అపవిత్ర ప్రదేశం కాదు, ఇదే నాకు స్వర్గమని చెబుతాడు. ఇది వీరుల నివాస స్థలం, కపాలాలతో నిండివుండే ఈ భయంకర ప్రదేశం నాకు అందంగానే కనిపిస్తుంది. నిట్టమద్యాహ్నం సమయంలో ఆరుద్ర నక్షత్రం వున్న రోజు దీర్ఘాయుష్షు కోసం పూజచేసేవారు, అపవిత్ర, పాపపు పనులు చేసే మగవారు స్మశానంలో వెల్లకూడదని అంటారు.
శివుడు ఇంకా చెబుతూ.. నా ఆఘ్న లేకుండా భూత గణాలు ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టవు. మానవుల క్షేమం కోరే వాడిని కాబట్టే నా భూతగణాలను స్మశానం దాటి బయటకు పోనివ్వను, ఇదే నేను ఇక్కడ వుండటానికి గల రహస్యమని చెబుతాడు. స్మశానంలో శివుడి రూపం గురించి కూడా అమ్మవారు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు చాలా భయంకరమైన రూపంతో శివుడు కనబడతాడు, శరీరం మొత్తం బూడిదతో, జుట్టు ముడి వేసి, ఎర్రటి కళ్లతో కనిపిస్తాడు. లోక రక్షణ కోసమే ఈ భీకర రూపం దాల్చానని చెబుతాడు.

శివుడు, విష్ణువు, ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క భిన్న రూపాలు. మానవ సహజ స్వభావాలకు వీరు ప్రతీకలుగా నిలిచారు. విష్ణువు హృదయంలో శివుడు, శివుడి హృదయంలో విష్ణువు వుంటాడని అంటారు. భగవంతుడు ఒక్కడే కాని ఆయన రూపాలు అనేకమని గ్రహించాలి. ఒకరు సౌమ్య గుణానికి మరొకరు తేజో గుణానికి ప్రతీకలు.
మీరు శరీరానికి బూడిదను ఎప్పుడూ ఎందుకు పూసుకుంటారో చెప్పమని అడుగుతుండి పార్వతి. దానికి శివుడు.. స్మశానానికి అందరూ రామనామ జపాన్ని చేస్తూ వస్తారు. ఆ రామనామం వినడానికి నేను ఈ రుద్రభూమికి వస్తూ వుంటాను. రామనామాన్ని జపించచేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను. కాబట్టి అగ్నితో దహించబడ్డ ఆ శరీరానికి సంబంధించిన చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాను. రామనామం జపించేవారంటే తనకు చాలా ఇష్టమని కూడా చెబుతాడు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలన్నీ ప్రముఖ పండితులు, ఇంటర్నెట్, ఆధ్మాత్మిక పుస్తకాల నుంచి సేకరించబడింది. కాబట్టి వీటిని మేము పూర్తిగా సరైనదని దృవీకరించలేము.



Click it and Unblock the Notifications











