Latest Updates
-
వేడి వేడి అన్నం, రసంలోకి అదిరిపోయే కాంబినేషన్.. తమిళనాడు ఫేమస్ కొంగు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే -
తెలుసుకోకుండానే ప్రేమ చల్లారిపోతోంది ఇది మీ బంధంలో జరుగుతోందా? -
పల్లెటూరి స్టైల్ రవ్వ ఇడ్లీ: ఒక్కసారి ఇలా చేస్తే.. హోటల్ రుచిని మించిపోతుంది -
శరీరంతో చేసిన ద్రోహం కంటే మనసు పరాయిదైపోవడం ఎందుకు ఎక్కువగా గుండె పగులుస్తుంది -
నోరూరించే మధురై మటన్ పొడిమాస్.. ఇలా చేస్తే వదలకుండా తింటారు! -
World No Tobacco Day: సిగరెట్ వదిలేసిన 20 నిమిషాల్లోనే అద్భుతం.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
రాహు కేతు దోషంతో సమస్యలేనా? జ్యోతిష్య శాస్త్రం చెప్పే శక్తివంతమైన పరిహారాలు ఇవే! -
ఒక్క ముద్దతో వేరే లోకానికి.. అద్భుతమైన రుచితో నోరూరించే మ్యాంగో పులావ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ పనీర్ బటర్ మసాలా: ఒక్కసారి ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతారు! -
మే 31: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.. కెరీర్, ఆర్థికంగా తిరుగులేని విజయాలు మీ సొంతం!
షుగర్ ఉన్నవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే అద్భుతమైన టిఫిన్స్ ఇవే!
ఉదయం నిద్ర లేవగానే షుగర్ (డయాబెటిస్) ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. షుగర్ ఉందని ఇష్టమైనవన్నీ తినడం మానేసి, రోజువారీ చప్పటి ఆహారం తింటూ బాధపడేవారు చాలా మందే ఉన్నారు. వాస్తవానికి మధుమేహం ఉన్నవారు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ తినకూడదని ఎక్కడా లేదు. బ్రేక్ ఫాస్ట్ అనేది రోజు మొత్తంలో మనం తీసుకునే అతి ముఖ్యమైన భోజనం.

సరైన ఆహారాన్ని ఎంచుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడమే కాకుండా ఉదయం పూట ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. మరి షుగర్ ఉన్నవారికి ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ అత్యుత్తమమో, డాక్లర్లు ఏం సూచిస్తున్నారో ఇక్కడ చూడండి.
ఇడ్లీ - కారప్పొడి లేదా సాంబార్
దక్షిణాది ప్రజల ఆల్ టైమ్ ఫేవరెట్ అల్పాహారం ఇడ్లీ. దీనిని ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి ఇందులో ఫ్యాట్ (కొవ్వు) శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో తేలికైన ఆహారం, త్వరగా అరిగిపోతుంది. మధుమేహం ఉన్నవారు ఇడ్లీని కారప్పొడితో కానీ, సాంబార్ తో కానీ కలిపి తినడం చాలా మంచిది. కారప్పొడిలో క్యాలరీలు, షుగర్ లెవల్స్ పెంచే గుణాలు తక్కువగా ఉంటాయి. ఇక సాంబార్ విషయానికొస్తే.. ఇందులో కందిపప్పు, మునక్కాయలు, క్యారెట్, టమాటా వంటి రకరకాల కూరగాయలు ఉంటాయి. దీనివల్ల శరీరానికి కావాల్సినంత ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.
వెజిటేబుల్ ఉప్మా
రెగ్యులర్ గా తినే ఉప్మా అంటే బోర్ అనుకునే వారు దాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఉప్మా చేసేటప్పుడు అందులో క్యారెట్, బీన్స్, బఠానీలు, టమాటా, ఉల్లిపాయలు వంటి కూరగాయల ముక్కలను ఎక్కువగా వేసి వండుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ తో చేసిన ఉప్మా తినడం వల్ల శరీరానికి మంచి ఫైబర్ (పీచు పదార్థం) అందుతుంది. ఇది త్వరగా ఆకలి వేయనివ్వదు, కడుపు నిండిన భావన కలిగిస్తుంది. షుగర్ పేషెంట్లకు ఉదయం పూట ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
పెసరట్టు
పెసరట్టు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. పెసల్లో ప్రోటీన్, ఫైబర్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ (షుగర్) స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. పైగా ఇది తింటే ఎక్కువ సేపు కడుపు ఫుల్ గా ఉండి శక్తినిస్తుంది. దీనివల్ల మధ్యమధ్యలో అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి వేసి చేసిన పెసరట్టు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఉడకబెట్టిన కోడిగుడ్లు, మొలకలు
ఉదయం పూట శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కండరాలు దృఢంగా ఉండటానికి, రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి ఉడకబెట్టిన కోడిగుడ్డు, మొలకలు (స్ప్రౌట్స్) తీసుకోవచ్చు. పెసలు, శనగలు వంటి వాటితో చేసిన మొలకల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
చిరుధాన్యాల (మిల్లెట్స్) దోశ, ఉప్మా
ఈ రోజుల్లో అందరూ ఆరోగ్య ప్రదాయినులైన మిల్లెట్స్ (చిరుధాన్యాలు) వైపు మొగ్గుచూపుతున్నారు. కొర్రలు, అరికెలు, సామలు వంటి వాటితో చేసిన దోశ లేదా ఉప్మా తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిది. సాధారణ బియ్యం కంటే ఈ మిల్లెట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి, షుగర్ ను ఒకేసారి కాకుండా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది.
మూంగ్ దాల్ - ఓట్స్ పొంగల్
ఓట్స్ లో కరిగే ఫైబర్ విశేషంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా, షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.పెసరపప్పుతో (మూంగ్ దాల్) కలిపి ఓట్స్ పొంగల్ చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ కాంబినేషన్ లో ప్రోటీన్, ఫైబర్ కలయిక వల్ల ఉదయం పూట పర్ఫెక్ట్ డైట్ గా పనికొస్తుంది.
షుగర్ ఉన్నవారు ఉదయం పూట ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి?
డీప్ ఫ్రై ఐటమ్స్ వద్దు: పూరీ, వడ, బోండా, బజ్జీ వంటి నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలను అస్సలు తినకూడదు. ఇవి బరువు పెరగడానికి, చెడు కొలెస్ట్రాల్, షుగర్ పెరగడానికి కారణమవుతాయి.
చక్కెర వద్దు: ఉదయం లేవగానే తాగే టీ, కాఫీలలో పంచదార (చక్కెర) వేసుకోవడం పూర్తిగా మానేయాలి.
బ్రెడ్ కు దూరం: మైదాతో చేసిన బేకరీ బ్రెడ్ కు దూరంగా ఉండాలి. ఇది తిన్న వెంటనే బ్లడ్ షుగర్ అమాంతం పెరిగిపోతుంది.
పండ్ల రసాలు (ఫ్రూట్ జ్యూస్ లు) వద్దు: మధుమేహం ఉన్నవారు పండ్లను ముక్కలుగా కోసుకుని నేరుగా తినవచ్చు, దీనివల్ల ఫైబర్ అందుతుంది. కానీ వాటిని జ్యూస్ లాగా చేసుకుని అస్సలు తాగకూడదు. జ్యూస్ చేసినప్పుడు అందులో ఫైబర్ అంతా పోయి, కేవలం ఫ్రక్టోజ్ (న్యాచురల్ షుగర్) మాత్రమే మిగులుతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.



Click it and Unblock the Notifications