Latest Updates
-
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
అనుకోని ధన యోగం.. ఈ రాశుల వారికి నేడు కెరీర్, ఆర్థిక పరంగా తిరుగులేని అదృష్టం! -
మీ ఇంట్లో RO వాటర్ వాడుతున్నారా? మలమూత్రాల ద్వారా వచ్చే ఈ-కొలి బ్యాక్టీరియా..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. -
గురు పుష్య యోగం: ఈరోజు బంగారం కొంటే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయా? అదృష్టం మీదే! -
కూరల్లో పెరుగు వేసేటప్పుడు ఇలా చేస్తే అస్సలు విరిగిపోదు..సెలబ్రిటీ చెఫ్ టిప్స్! -
2026లో అధిక మాసం వచ్చింది.. ఈ సమయంలో ఏ పనులు చేస్తే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయో తెలుసా? -
సర్వార్థ సిద్ధి యోగం: ఈ రోజు ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 21 మే 2026 -
కంచంలో ఎన్ని కూరలున్నా సరే.. ఈ మామిడి అల్లం చారు ముందు దిగదుడుపే! -
పల్లెటూరి స్టైల్ పానీపూరి ఇలా చేస్తే.. బయట దొరికే రుచిని మించిపోతుంది, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
మరో మహిళా నక్షత్రం ‘అరుంధతి రాయ్’!

బాల్యమంతా కేరళలోని అయమానం లో గడిచింది.తమిళనాడు లోని నీలగిరిలో వున్న లవ్ డేల్ లారెన్స్ స్కూలులో ప్రాధమిక విద్యాభ్యాసం చేసింది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆర్కిటెక్చర్ చేసింది. ఇక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డా కున్హాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. రాయ్ రెండవ భర్త పేరొందిన సినీ నిర్మాత ప్రదీప్ క్రిషన్. అతని అవార్గు పొందిన చిత్రంలో ఆమె నటించింది. ఆమె టెలివిజన్ లో పనిచేస్తూనే కొన్ని సినిమాలలో కూడా నటించింది. 1994 లో ఫూలన్ దేవి నటించిన శేఖర్ కపూర్ చిత్రం బండిట్ క్వీన్ ను విమర్శించడంతో ఆమె వార్తల కెక్కింది. ఆమె మొదటి నవల గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ 1992 లో మొదలుపెట్టబడి 1996లో పూర్తయింది. ఇందులో చాలా భాగం ఆమె బాల్య జీవితం ప్రతిబింబిస్తుంది.
ఆమె వ్రాసిన ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. దానికి 1997 బుకర్ ప్రైజ్ వచి్చింది. ఈ పుస్తకం వాణిజ్య పరంగా కూడా బాగా అమ్ముడుపోయింది. ప్రచురణకు ముందు అడ్వాన్సుగా ఆమె సుమారు అర్ధ మిలియన్ పౌండ్లు పొందింది. సుమారు 18 దేశాలలో ఈమె పుస్తకం అమ్మకం జరిగింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలకుగాను ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆమె పుస్తకం విజయవంతం కావడంతో తర్వాతి రోజులలో ఆమె టి.వి. రచయితగా రచనలు మొదలుపెట్టింది. అరుంధతి రాయ్, వుయ్ ఆర్ ఒన్, సెలిబ్రేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ మొదలైన సమాజపర అంశాలతో మంచి రచనలు చేసి ఖ్యాతి గడించింది.
అరుంధతి రాయ్ మేధా పట్కర్ తో కలసి నర్మదా బచావ్ ఆందోళనలో పాల్గొంది. తనకు వచ్చిన బుకర్ ప్రైజ్ మనీ, ఇతర రాయల్టీలను నర్మదా బచావ్ ఆందోళన వ్యయంగా ఖర్చు చేసింది.



Click it and Unblock the Notifications