జూన్‌ 2న ఈ రాశిలోకి గురు గ్రహం.. ఆ రోజున ఏ పరిహారాలు చేస్తే మంచిది.?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్‌ 2న గురు గ్రహ సంచారం జరగబోతోంది. ఆ రోజున బృహస్పతి చంద్రుడి రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. గురు గోచారం జరిగే ఆ రోజు అత్యంత శుభప్రదమైనదిగా, ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజు కొన్ని ఆచారాలు, పరిహారాలు పాటించాలి. అవేంటంటే..


గురు గ్రహం మన జీవితంలో సంపద, వివాహం, అదృష్టానికి కారకంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా మన ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, జ్ఞానం, ఆధ్యాత్మికతపై ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో గురుడు తన రాశిని మార్చినప్పుడు, దాని ప్రభావం జాతకాలపై మాత్రమే కాకుండా శక్తి, ఆలోచన, వాతావరణంపై ప్రభావం చూపిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే బృహస్పతి సంచారం సానుకూల మార్పులకు సమయంగా పరిగణిస్తారు.

jupiter enters cancer on june 2nd do these pujas and rituals to get success

దేవతల గురువుగా భావించే బృహస్పతి.. జ్ఞానం, మతం, నైతికత, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. మీ జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, ఓర్పు, జీవితంలో స్థిరమైన పురోగతి సాధించడానికి దోహదపడుతుంది. జూన్‌ 2న గురు గ్రహ సంచారం కారణంగా వృత్తి, ఆర్థిక పరిస్థితి, మానసిక స్పష్టతలో దీర్ఘకాలిక అడ్డంకులను తొలగిస్తుంది. కొత్త అవకాశాలకు దారితీస్తుందని పండితులు వెల్లడించారు.

అయితే గురు గ్రహ ప్రభావం ఆకస్మిక ప్రయోజనాలను తెచ్చిపెట్టదని వేద పండితులు చెబుతున్నారు. ఇది క్రమంగా శాశ్వత పురోగతి వైపు నడిపిస్తుంది. అందుకే ఈ గురు గ్రహ సంచారంలో తీసుకున్న సరైన నిర్ణయాలు, పనిలో క్రమశిక్షణ, పద్ధతులు.. మీ భవిష్యత్తులో గణనీయమైన సానుకూల ఫలితాలను అందిస్తాయి. ఈ గోచారం సమయంలో పాజిటివ్‌ ఆలోచనలు, ఓర్పు, పాటిస్తే అనేక రంగాల్లో విజయాన్ని అనుభవించవచ్చు.


గురు గ్రహ సంచారం రోజున ఈ పరిహారాలు చేయాలి

గురు గ్రహాన్ని విష్ణుమూర్తిగా భావిస్తారు. ఆరోజు పసుపు పూలు, పసుపు, శనగలను సమర్పించినట్లయితే చాలా శ్రేయస్కరం. ఆరోజున అరటి చెట్టుపై నీళ్లు పోస్తే చాలా మంచింది. ఈ పరిహారం ద్వారా అదృష్టం, ఆర్థిక అవకాశాలు బలపడుతాయి. గురు గ్రహ సంచారం సమయంలో "ఓం బ్రీం బృహస్పతే నమః" మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రం ద్వారా మానసిక గందరగోళం తగ్గి.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

గురు గోచర సమయంలో పసుపు, శనగపప్పు, పసుపు రంగు దుస్తులు, కుంకుమపువ్వు లేదా పసుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పరిహారం ఆర్థిక స్థిరత్వం, గౌరవంతో పాటు సానుకూల అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇంట్లోని ఈశాన్య మూలను వెలుతురుతో, ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీని వలన మానసిక స్పష్టత, ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తి కలుగుతాయి.

గురువారాల్లో పేదలకు శనగపిండి లడ్డూలు, కుంకుమపువ్వు కలిపిన మిఠాయిలు వంటి వాటిని దానం చేయడం ద్వారా గురు గ్రహం బలపడుతుంది. ఫలితంగా జీవితంలో మాధుర్యంతో పాటు స్థిరమైన పురోగతి చేకూరుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion