Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ఎర్రటి జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే....

1. ఉద్దిపప్పు ఒకటిన్నర టీ స్పూను, 15వరకు వేపాకులను తీసుకుని వీటిని పుల్లటి మజ్జిగలో నానపెట్టండి. అటుపై ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాలి. ఇలా తయారు చేసిన పేస్టును తలకు పూర్తిగా పట్టించి, బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయండి. ఈ విధంగా 10 నుంచి 15 రోజుల వరకు క్రమం తప్పకుండా చేస్తే రాగిరంగు జుట్టు క్రమంగా నల్లబడి మీరు కోరే అందమైన కురులు మీ సొంతమౌతుంది.
2. ప్రతిరోజు తలస్నానం, కండీషనింగ్ చేసుకోవాలి. ఆలీవ్ నూనెకు గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత తలస్నానం చేస్తే, జట్టుకు చక్కని పోషణ అంది పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
3. రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్నూనె కలిపి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి తలంతా బాగా పట్టించాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఒక కప్పు కమలాపండు రసానికి ఒక టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కల కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.
4. వెంట్రుకలు మరీ జీవం కోల్పోయినట్లు అనిపిస్తున్నట్లయితే.. అరకప్పు బాగా పండిన అరటిపండు గుజ్జుకు నాలుగైదు చుక్కల బాదం నూనె చేర్చి జుట్టుకు బాగా పట్టించాలి. కాసేపటి తరువాత, ముందుగా సోడాతోనూ ఆ తర్వాత నీటితోనూ కడిగేయాలి. చివరగా కండిషనింగ్ చేసుకుంటే జట్టు సహజ స్థితిలోకి వస్తుంది.
5. షాంపూను ఎప్పుడూ నీటిలో కలిపిన తరువాతే తలకు పట్టించి అంటుకోవాలి. నేరుగా షాంపూను జుట్టుకు తగలనివ్వకూడదు. షాంపూ చేసుకున్న వెంటనే జుట్టుకు, అర మగ్గు నీటిలో ఒక నిమ్మరసం, ఒక చెంచా వెనిగర్ కలిపి కండిషనర్లా వాడుకోవాలి. జిడ్డుగా వుండే జట్టుకు మసాజ్ చేసేటప్పుడు, నూనెకు మారుగా హెయిర్ టానిక్లను వాడాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఉంటుంది.



Click it and Unblock the Notifications