డయాబెటిస్‌ కు ఆహారంతో చెక్!

By B N Sharma

Control Diabetes with Foods!
మన దేశంలో ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య చాలా ఎక్కువ. కాస్త వయస్సుపైబడితే చాలు పురుషులైనా మహిళలైనా ఈ వ్యాధి వచ్చి తీరుతోంది. కనుక ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి మన దరిదాపులకు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

- మొలకెత్తిన గింజలు తింటే శరీరములోని రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది.

- ఆహారంలో పొట్టుతో ఉన్న రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు తీసుకోవాలి. తెల్లబియ్యం వాడరాదు. బదులుగా బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యం వంటివి తింటే రక్తంలో బ్లడ్ షుగర్ నియంత్రించి డయాబెటీస్ రాకుండా చేస్తాయి.

- వివిధ రకాల పళ్ళు పీచు కలిగి వుంటాయి. ఇవి తింటే డయాబెటీస్ దరి చేరదు.

- పళ్లు తన్నేటప్పుడు ఎక్కువ తీపి కలిగన పండ్లు తినకూడదు. ప్రత్యేకంగా ఖర్జూరం, అరటి పండు, మామిడి వంటి పండ్లు తీసుకోకూడదు.

- తీపి తక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువగా తినవచ్చు.

- ప్రతిరోజూ తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నడక ప్రయోజనం కలిగిస్తుంది.

- ఆహారం రోజులో ఎప్పుడు తీసుకున్నా మితంగా తగినంత మాత్రమే తీసుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, March 1, 2012, 15:37 [IST]
Desktop Bottom Promotion