ఉప్పు అధికంగా తినేస్తే....?

By B N Sharma

Excessive Salt Consumption
వంటకం ఎంత రుచిగా వున్నప్పటికి కొంతమంది దానిలో మరి కొంచెం ఉప్పు వేసుకుని మరీ ఆనందంగా తినేస్తారు. ఉప్పు అధికం అయితే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఉప్పు శరీరం సక్రమంగా పనిచేయటానికి అవసరమే కాని, అధికం అయితే ప్రమాదం. ఉప్పు అధికం అయితే, రక్తపోటు, గుండెజబ్బులు వస్తాయి. కనుక మనం ఉప్పు అధికంగా తింటున్నామా? లేక తగిన పాళ్ళలోనే తింటున్నామా అని తెలుసుకోడానికి కొన్ని చిట్కాలు చూడండి.

రక్తపోటు - ఉప్పు అధికంగా తింటే రక్తంలో సోడియం పెరుగుతుంది. ఈ అసమతుల్యత కిడ్నీలు శరీరంనుండి నీటిని బయటకు పంపటానికి అసౌకర్యం కలిగిస్తుంది. శరీరంలో ఆగిన నీటి కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిపడి రక్తపోటు వస్తుంది. రక్తపోటు గుండె, బ్రెయిన్, కిడ్నీ విఫలత మొదలగు వ్యాధులకు కారణమవుతుంది.

దాహం - శరీరంలో అధిక ఉప్పు వుంటే, దానిని రక్తంలో కలపటానికి శరీరానికి అధిక నీరు కావాలి. అందుకని మీరు దాహం భావిస్తారు.
శరీరం లావెక్కుతుంది - ఉప్పు అధికమై శరీరంలో నీరు లేకుంటే శరీర భాగాలు ఉబ్బుతాయి. మూత్రం సరిగా రాదు.

మూత్రం మంట - ఉప్పు అధికం కాగానే కిడ్నీలు మూత్రాన్ని ఆపుతూ ఆ నీటిని ఉప్పు కొరకు ఉపయోగిస్తాయి. ఫలితంగా మూత్రం పోసేటపుడు మంట వస్తుంది.

ఈ చిహ్నాలు మీలో కనపడితే మీరు ఉప్పు అధికంగా తింటున్నట్లే. పరిష్కారంగా ప్రతిరోజూ నీటిని అధికంగా తాగడం, ఉప్పు అధికంగా వుండే ప్యాకేజ్ ఆహారాలు మానటం చేయాలి. తాజా పండ్లు, కూరలు తినాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, February 16, 2012, 9:22 [IST]
Desktop Bottom Promotion