రూ.2.84 లక్షల మందు ఇకపై రూ.8,880లకే!

By B N Sharma

Cancer Drug
కేన్సర్ చికిత్సలో వాడే మందు నక్సవార్ ఇకపై రోగులకు రూ.8,880 కే (120 టాబ్లెట్ల ప్యాక్) లభ్యం కానుంది. ఈ మందు ప్రస్తుత ధర రూ.2.84 లక్షలుగా వుంది. దీనిని జర్మన్ మల్టీ నేషనల్ కంపెనీ బేయర్ పేటెంట్ కలిగి సోరాఫెనీబ్ టోసీలేట్ లనే బ్రాండ్ పేరుతో అమ్మకాలు సాగిస్తోంది.

ఈ మందు ధర ఇంత బాగా తగ్గిపోవటానికి కారణం...ఇండియన్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ ఇండియాలో మొట్టమొదటి కంపల్సరీ లైసెన్స్ ను హైద్రాబాద్ సంస్ధ నాట్కో ఫార్మా కు మంజూరు చేసింది. ఈ మందు సోరాఫెనీబ్ టోసీలేట్ ను కిడ్నీ మరియు లివర్ కేన్సర్ల చికిత్సకు వాడతారు. లైసెన్స్ మంజూరు చేసిన కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ పి.హెచ్. కురియన్ నాట్కో ఫార్మా ఈ మందును కనీసం 600 మంది రోగులకు ప్రతి సంవత్సరం ఉచితంగా కూడా అందించాలని ఆదేశించారు.

ప్రస్తుత ధరలో మూడోవంతు రేటుకే ఈ మందు అమ్మకాన్ని సిఎస్ ఐ ఆర్ డైరెక్టర్ జనరల్ సమీర్ బ్రహ్మచారి స్వాగతించారు. కంపెనీలు లాభాలు గడించవచ్చు...కాని రోగుల బాధలపట్ల వాటిని సంపాదించరాదని వ్యాఖ్యానించినట్లు ది హిందూ పత్రిక ప్రచురించింది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, March 13, 2012, 12:42 [IST]
Desktop Bottom Promotion