భక్తులను అలరించే సీతారాముల కళ్యాణ మహోత్సవం!

By B N Sharma

Sri Rama Navami
తెలుగువారి ప్రధాన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ఈ పండుగ భ్రధ్రాచలంలోని శ్రీరామచంద్రుని దేవాలయంలో అతి వైభవంగా ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో చేస్తారు. పునర్వసు నక్షత్రం శ్రీ రామచంద్రుని జన్మ నక్షత్రం. ఇదే రోజున ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ ప్రతిఏటా మార్చి నెల చివర లేదా ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తారు.

శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.

సీతారాముల కళ్యాణం కొరకుగాను ప్రభుత్వం భధ్రాచలంలో నేడు భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శ్రీరామ కళ్యాణంలో తమవంతు సేవగా తలంబ్రాలు ప్రభుత్వం తరపున అర్పిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళ తలంబ్రాలు కార్యక్రమం జరుపుతారు. దూరదర్శన్, వివిధ ప్రధాన ఛానెళ్ళు కన్నులపండువగా జరిగే ఈ వేడుకలను రాష్ట్రమంతటా ప్రచారం చేస్తాయి. ఆకాశ వాణి సీతారాముల కళ్యాణంపై తమ వ్యాఖ్యలను వినిపిస్తుంది.

Story first published: Sunday, April 1, 2012, 12:49 [IST]
Desktop Bottom Promotion