హైదరాబాద్‌లో దొరికే ఈ ఫుడ్స్ ఇక తినలేము.. బ్యాన్ చేసిన ప్రభుత్వం!

మనం తినే ఆహారాల్లో కొన్ని ఆరోగ్యానికి చెడు చేసేవి ఉంటాయి. అందుకే వాటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే మనం ఏవైతే ఇష్టంగా తింటామో, ఆరోగ్యానికి మంచిదని బావిస్తామో ఆ ఆహార పదార్థాలను విదేశాల్లో బ్యాన్ చేశారు. ఆ జాబితాలో మన బెల్లం కూడా ఉంది. అసలు ఎలాంటి ఆహార పదార్థాలను బ్యాన్ చేశారు ఎందుకు వీటిని బ్యాన్ చేయాల్సి వచ్చింది ఏ ఏ దేశాల్లో బ్యాన్ విధించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తమలపాకు

దేవుళ్ళకు పూజలు చేసేందుకు పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కిళ్ళి వేసేందుకు ఈ తమలపాకులను వినియోగిస్తుంటారు. అయితే ఈ తమలపాకులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో తమలపాకును ప్రపంచంలోని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు.

7 Famous indian foods which were banned in foreign countries

కిండర్‌ జాయ్

మనం దేశంలోని పిల్లలు ఈ కిండర్ జాయ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. కిరాణా షాపుకు లేదా బేకరీకి పిల్లలు తీసుకెళ్తే ఈ కిండర్ జాయ్ ఇప్పించకుంటే అస్సలే వదలరు. ఆరోగ్యానికి మంచిది కాదన్నా దీన్నే తినాలని అనుకుంటూ ఉంటారు. పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో చెడు చేసే ఈ స్నాక్‌ను విదేశాల్లోని చాలా దేశాలు బ్యాన్ చేశాయి. వీటిని తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, బ్యాన్ చేశాయి.

వంకాయ సాంబార్

సాధారణంగా సాంబార్‌లో వంకాయ వేసుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో వంకాయ సాంబార్‌ను నిషేధించారు. మరీ ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో ఈ వంకాయ సాంబార్‌కు అనుమతి లేదు. ఎవరూ దీనిని తినడానికి వీలు లేదు.

రెడ్ కలర్ నెయ్యి

మన దేశంలో నెయ్యి చాలా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా మన పూర్వికులు వాడిన రెడ్ కలర్ నెయ్యి చాలా ప్రాచీనమైనది. ఈ నెయ్యితో చిన్న చిన్న మిఠాయిలను తయారు చేస్తారు. అయితే ఈ నెయ్యిని వినియోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని, కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు. వీటితో తయారు చేసే స్వీట్స్‌ను కూడా నిషేధించారు.

బెల్లం

భారతదేశంలో ప్రతి ఇంట్లోని వంట గదిలో బెల్లం ఉంటుంది. బెల్లంతో ఎన్నో రకాల వంటకాలను మనం చేసుకుంటూ ఉంటాం. కానీ అమెరికాలో ఈ బెల్లంను నిషేధించారు. అక్కడి ఆహార ప్రమాణాలు పాటించడం లేదని బెల్లంపై నిషేధం విధించారు. అక్కడి ప్రజలు కేవలం చెక్కర మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

నెయ్యి

నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదని మనం తింటూ ఉంటాం. కానీ ఇందులో కొవ్వు పదార్ధం, ఉభయకాయం, రక్తపోటు, గుండెపోటుకు దారి తీసే కారకాలు ఉన్నాయని పలు దేశాల్లో నిషేధించారు. కానీ మన దగ్గర మాత్రం నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము.

సమోసా

ముంబయి లాంటి పెద్ద సిటీలో కూలి పనికి వెళ్లి సమోసా తినేవాళ్ళు ఉన్నారు. చాలా మంది 10 రూపాయల సమోసాతో తృప్తి పడుతున్నారు. అయితే దీనిని సోమాలియాలో నిషేధించారు. ఇది నూనెలో వేయించిన ఆహరం కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిషేధించారు. దీనిని తింటే అక్కడి ప్రభుత్వం కఠిన శిక్ష విధించనుంది.

Story first published: Wednesday, December 4, 2024, 17:22 [IST]
Desktop Bottom Promotion