Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Chanakya Niti: జీవితం సాఫీగా సాగాలంటే ఈ దుర్గుణాలను దూరంగా ఉంచండి
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు. జీవితం సాఫీగా సాగడానికి కొన్ని దుర్గుణాలను దూరంగా ఉంచాలని, తద్వారా జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు. ఆచార్యుడు చెప్పిన ఆ దుర్గుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాతృత్వానికి దూరంగా ఉండొద్దు:
దానధర్మాలకు ఎప్పుడూ దూరంగా ఉండొద్దని చాణక్యుడు సూచించాడు. దాతృత్వం లేని జీవితం అర్థరహితం అన్నాడు. ఆదాయంలో కొంత భాగాన్ని ఎప్పుడూ పేదలకు, నిరాశ్రయులకు దానం చేయాలని చెప్పాడు. దానధర్మాన్ని అనుసరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని, ఇది మీకు, మీ కుటుంబానికి మంచిదని చెప్పాడు చాణక్యుడు.
అగౌరవం:
ఎవరినీ, ఎప్పుడూ అగౌరవపరచకూడదని చాణక్యుడు సూచించాడు. ఎదుటి వారిని గౌరవించినప్పుడే మనకూ గౌరవం దక్కుతుందన్నాడు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేదిగా అభివర్ణించాడు. మంచి మాట, మంచి వ్యక్తిత్వం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని సూచించాడు ఆచార్య చాణక్యుడు.
కోపం:
కోపం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వస్తుంది. కోపం మనిషికి అతిపెద్ద శత్రువు అని తెలిసినా దానిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం మూర్ఖత్వమని చాణక్యుడు చెప్పాడు. కోపం మానవ లక్షణం దానిని మొత్తానికే రాకుండా ఉంచడం అసాధ్యం. కానీ దానిని అదుపులో ఉంచగలగడం ముఖ్యమని చెప్పాడు చాణక్యుడు.
కరుణ లేకపోవడం:
ప్రతి ఒక్కరూ కరుణతో మెలగాలని చెప్పాడు చాణక్యుడు. కరుణ వల్ల ఇతరులకు మనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని, సత్సంబంధాలు ఏర్పడతాయని సూచించాడు. అందుకే కరుణ అలవర్చుకోవాలని అన్నాడు ఆచార్య చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











