Latest Updates
-
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.!
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు
విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశాన్ని ఎవరైనా పల్లెత్తి మాట అంటే మన రక్తం మరిగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటలీలో జరిగింది. ఇటలీ పర్యటనలో ఉన్న కొందరు భారతీయ మహిళలకు ఒక రెస్టారెంట్ లో తీవ్ర అవమానం ఎదురైంది. అయితే వారు మౌనంగా భరించలేదు. తమ దేశాన్ని కించపరిచిన ఒక వెయిటర్ ను నడి వీధిలో నిలదీసి, అతనితోనే సారీ చెప్పించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటలీలో మాకు జరిగింది ఇదే అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఖుషీ దుబే షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే?
వివాదానికి అసలు కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, రికార్డ్ అయిన వీడియోలో హుస్సేన్ అనే బంగ్లాదేశ్ కి చెందిన వెయిటర్ భారతీయ మహిళల బృందంపై విపరీతమైన అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. వారిని ఉద్దేశించి ఫ..గ్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళు అంటూ అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు. ఇది కేవలం ఆ మహిళలను మాత్రమే కాకుండా, యావత్ భారతదేశాన్ని అవమానించేలా ఉంది.
వెనక్కి తగ్గని మహిళలు..
విదేశీ గడ్డపై ఉన్నామని ఆ మహిళలు ఏమాత్రం భయపడలేదు. వారిలో ఒకరు ధైర్యంగా ముందుకు వచ ముందు నీ భాషను అదుపులో పెట్టుకో. మేము మహిళలం, మాతో ఎలా మాట్లాడాలో నేర్చుక అంటూ గట్టిగా బదులిచ్చారు. అయినా ఆ వెయిటర్ తన అహంకారాన్ని వీడకుండా మీరంతా దరిద్రపు ఇండియా నుండి వచ్చారు, ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు అంటూ జాత్యహంకార వ్యాఖ్యలకు దిగాడు. దానికి ఆ మహిళలు హుస్సేన్ గారూ, మర్యాదగా ఉండండి. ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోండి అని దీటుగా జవాబిచ్చారు.
పోలీసుల ఎంట్రీ.. వెయిటర్ యూటర్న్..
ఈ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఆ వెయిటర్ స్వరం మారింది. తన తప్పును కప్పిపుచ్చుకుంటూ ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ భారతీయ నారీమణులు అంతటితో వదిలిపెట్టలేదు. మా దేశాన్ని తిట్టావు. కాబట్టి భారతదేశాన్ని తిట్టినందుకు నన్ను క్షమించండి అని స్పష్టంగా చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. దానికి అతను తప్పించుకునే ప్రయత్నం చేసినా, వారు పట్టుబట్టి మరీ భారతదేశానికి క్షమాపణలు చెప్పించారు.
గౌరవం లేని చోట వెళ్లకండి..
ఈ సంఘటనపై ఖుషీ దుబే స్పందిస్తూ, విదేశాల్లో జరిగే ప్రతి గొడవలో భారతీయులదే తప్పు ఉంటుందనే అపోహను వీడాలి. కొన్నిసార్లు మనపై ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతారు. మీ దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి. జై హింద్ అని ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. మీరు అతనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాల్సింది, అతను శిక్షకు అర్హుడు అని కొందరు కామెంట్ చేయగా, అతడితో భారతదేశానికి క్షమాపణ చెప్పించిన తీరు అద్భుతం. మీరు నిజమైన దేశభక్తులు అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. మనకు గౌరవం లేని చోట మన డబ్బును ఎందుకు ఖర్చు చేయాలి? అలాంటి రెస్టారెంట్లను బహిష్కరించాలి అని ఇంకొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, విదేశీ గడ్డపై భారతీయ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఆ మహిళల తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.



Click it and Unblock the Notifications