Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కర్ణాటక ఎన్నికల్లో తలపడుతున్న ధనవంతులు, వేలాది కోట్లకు అధిపతులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికలు శక్తిమంతుల పోరు మాత్రమే కాదు ధనవంతుల పోరు కూడా. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న వేలాది కోట్ల ఆస్తులు ఉన్న అభ్యర్థులు వీరు.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) విశ్లేషణ ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన దాదాపు సగం మంది అభ్యర్తులు, 2,586 మందిలో 42% లేదా 1,087 మంది కోటీశ్వరులు ఉన్నారు. గత ఎన్నికల్లో వీరి సంఖ్య 35% మాత్రమే ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.12.26 కోట్లు ఉండగా 2018లో జరిగిన ఎన్నికల్లో ఇది రూ.7.5 కోట్లు

కాంగ్రెస్ నుండి 97 శాతం మంది అభ్యర్థులు, బీజేపీ నుండి 96శాతం మంది అభ్యర్థులు, జేడీఎస్ నుండి 82 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు.
పోటీలో ఉన్న అత్యధిక ధనవంతులు ఎవరంటే:
యూసుఫ్ షరీఫ్:
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కేజీఎఫ్ బాబు అని కూడా పిలువబడే యూసుఫ్ షరీఫ్ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడు. బెంగళూరులోని చిక్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈయన ఆస్తులు రూ.1,633 కోట్లకు మించి ఉన్నట్లు ప్రకటించారు.
ఎన్ నాగరాజు:
బీజేపీ ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి ఎన్. నాగరాజు.. ప్రస్తుతం బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నాగరాజు ఈ స్థానం నుండి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,609 కోట్లు.
డీకే శివకుమార్:
కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ ఆస్తులు రూ.1,413 కోట్లు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ప్రియా కృష్ణ:
ప్రియా కృష్ణ 2009 బెంగళూరులోని గోవింద్ రాజ్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి ఎం.కృష్ణప్ప పెద్ద కుమారుడు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన గోవిందరాజనగర్ నియోజవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,156 కోట్లు.
సురేషా బీఎస్:
కాంగ్రెస్ నాయకుడు సురేషా బీఎస్ (బైరతి సురేష్) ను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా చూస్తారు. ఈయన ఆస్తుల విలువ రూ.648 కోట్లు.



Click it and Unblock the Notifications











