Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
కర్ణాటక ఎన్నికల్లో తలపడుతున్న ధనవంతులు, వేలాది కోట్లకు అధిపతులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికలు శక్తిమంతుల పోరు మాత్రమే కాదు ధనవంతుల పోరు కూడా. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న వేలాది కోట్ల ఆస్తులు ఉన్న అభ్యర్థులు వీరు.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) విశ్లేషణ ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన దాదాపు సగం మంది అభ్యర్తులు, 2,586 మందిలో 42% లేదా 1,087 మంది కోటీశ్వరులు ఉన్నారు. గత ఎన్నికల్లో వీరి సంఖ్య 35% మాత్రమే ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.12.26 కోట్లు ఉండగా 2018లో జరిగిన ఎన్నికల్లో ఇది రూ.7.5 కోట్లు

కాంగ్రెస్ నుండి 97 శాతం మంది అభ్యర్థులు, బీజేపీ నుండి 96శాతం మంది అభ్యర్థులు, జేడీఎస్ నుండి 82 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు.
పోటీలో ఉన్న అత్యధిక ధనవంతులు ఎవరంటే:
యూసుఫ్ షరీఫ్:
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కేజీఎఫ్ బాబు అని కూడా పిలువబడే యూసుఫ్ షరీఫ్ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడు. బెంగళూరులోని చిక్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈయన ఆస్తులు రూ.1,633 కోట్లకు మించి ఉన్నట్లు ప్రకటించారు.
ఎన్ నాగరాజు:
బీజేపీ ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి ఎన్. నాగరాజు.. ప్రస్తుతం బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నాగరాజు ఈ స్థానం నుండి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,609 కోట్లు.
డీకే శివకుమార్:
కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ ఆస్తులు రూ.1,413 కోట్లు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ప్రియా కృష్ణ:
ప్రియా కృష్ణ 2009 బెంగళూరులోని గోవింద్ రాజ్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి ఎం.కృష్ణప్ప పెద్ద కుమారుడు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన గోవిందరాజనగర్ నియోజవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,156 కోట్లు.
సురేషా బీఎస్:
కాంగ్రెస్ నాయకుడు సురేషా బీఎస్ (బైరతి సురేష్) ను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా చూస్తారు. ఈయన ఆస్తుల విలువ రూ.648 కోట్లు.



Click it and Unblock the Notifications