Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
Jakhu Temple: షిమ్లా హనుమాన్ ఆలయంలో ప్రియాంక గాంధీ పూజలు, ఈ ఆలయం చాలా పవర్ఫుల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ షిమ్లాలోని జాఖూ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశంతో పాటు కర్ణాటక రాష్ట్ర శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రియాంక ఈ ఆలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాఖూ హనుమాన్ ఆలయం ప్రత్యేక, విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షిమ్లాలోని ప్రధాన దేవాలయం:
జాఖూ దేవాలయం హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి. ఈ హనుమాన్ టెంపుల్ జాఖూ కొండపై ఉంటుంది. అలా దీనికి జాఖూ హనుమాన్ టెంపుల్ అనే పేరు వచ్చింది. పచ్చని చెట్లు, తెల్లటి మంచు, ప్రకృతితో ఈ దేవాలయం చాలా సుందరంగా ఉంటుంది. ఈ దేవాలయం గురించి పురాణాల్లోనూ ఉంది. ఈ ప్రదేశంలో షిమ్లాలో ఎక్కువగా సందర్శించే దేవాలయాల్లో ఒకటి.

అతిపెద్ద హనుమాన్ విగ్రహం:
జాఖూ హనుమాన్ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ అక్కడి ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. పచ్చని చెట్లని మధ్యలో కాషాయ రంగులో కనిపించే హనుమాన్ విగ్రహం చాలా గంభీరంగా, అందంగా ఉంటుంది. ఎత్తైన చెట్ల కంటే ఎత్తుగా ఈ విగ్రహం కనువిందు చేస్తుంది.
జాఖూ ఆలయ పురాణం:
రామాయణంలో ఇంద్రజిత్తు లక్ష్మణుడిని గాయపరుస్తాడు. లక్ష్మణుడిని బతికించడానికి ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్తాడు. ఆ సమయంలో జాఖూ కొండపై కొంతసేపు ఆగాడని, ఓ ఋషిని కలిసి సంజీవని సమాచారం తెలుసుకున్నాడని పురాణం చెబుతోంది.
సంజీవనిని తీసుకున్న తర్వాత తిరిగి వెళ్లే దారిలో కలుస్తానని యాకు ఋషికి వాగ్దానం ఇస్తాడు హనుమాన్. అయితే వివిధ కారణాల వల్ల యాకు ఋషిని కలవలేకపోతాడు. హనుమాన్ గౌరవార్థం ఆ ఋషి జాఖూ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ కోతులు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. వాటిని హనుమాన్ వారసులుగా భావిస్తారు. వాటికి కూడా దైవత్వం ఉందని నమ్ముతారు.



Click it and Unblock the Notifications