Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ప్రియుడిపై మోజుతో భర్తకు ఇష్టమైన మాంసం వండి తినిపించింది.. తర్వాత చంపేయాలనుకుంది
ప్రియుడిపై మోజుతో భర్తకు ఇష్టమైన మాంసం వండి తినిపించింది.. తర్వాత చంపేయాలనుకుంది. దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. భర్తను చంపిన భార్య, గుంటూరు దాచేపల్లిలో భర్తపై దాడి
రుచికరంగా మాంసం కూర వండి అందులో నిద్ర మాత్రలు కలిపింది ఆ భార్య. ప్రేమగా భర్తకు వడ్డించింది. అతడు శుభ్రంగా తినేసి నిద్రలోకి జారుకున్నాడు. ఆదమరచి నిద్రపోతున్న అతడి ముఖంపై ప్రియుడితో కలిసి దిండు వేసి బలవంతంగా నొక్కింది. ఊహించని ఈ పరిణామానికి ఉలిక్కిపడి లేచి గట్టిగా అరిచాడు డానియేలు. ఇది సీరియల్ కాదు... సినిమా కాదు. నిజజీవితంలో జరిగిన సంఘటన.

అమ్మాయిలను సున్నిత మనస్కులనుకుంటారు అందరూ అమ్మాయిలను సున్నిత మనస్కులనుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా కఠినంగా ఉంటారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలసి భార్య చేసిన యత్నం విఫలమైంది.
అందరూ అమ్మాయిలను సున్నిత మనస్కులనుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా కఠినంగా ఉంటారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలసి భార్య చేసిన యత్నం విఫలమైంది.

దానియేలుకు రత్నకుమారితో వివాహం
దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.... కేసానుపల్లికి చెందిన వినుకొండ దానియేలుకు అదే గ్రామానికి చెందిన రత్నకుమారితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు.

వీరి మధ్యలోకి బెంజిమెన్
వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి మధ్యలోకి బెంజిమెన్ అనే వ్యక్తి వచ్చాడు. చర్చి ఫాదర్గా తనని తాను పరిచయం చేసుకుని కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతుండేవాడు. పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన కంభంపాటి బెంజిమెన్కు కేసానుపల్లి ఎస్సీ కాలనీలో చర్చి ఫాదర్గా చెప్పకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

రత్నకుమారి, బెంజిమన్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది
ఈ క్రమంలోనే రత్నకుమారి, బెంజిమన్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. చీకటి రహస్యం ఎంతో కాలం దాగలేదు. భర్తకు తెలిసింది.
రత్నకుమారితో బెంజిమెన్ చనువుగా ఉండడాన్ని గమనించిన భర్త దానియేలు పలుమార్లు బెంజిమెన్ను హెచ్చరించాడు.

బెంజిమెన్తో కలిసి ప్లాన్
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాత్రి దానియేలు ఇంటికి వచ్చాడు. భోజనం పెట్టామని భార్యను దానియేలు అడిగాడు. భర్తని ఎలాగైనాఅడ్డుతొలగించుకోవాలని ప్రియుడు బెంజిమెన్తో కలిసి ప్లాన్ చేసింది భార్య.

మాంసం కూర వండి అందులో నిద్ర మాత్రలు
రుచికరంగా మాంసం కూర వండి అందులో నిద్ర మాత్రలు కలిపింది. ప్రేమగా భర్తకు వడ్డించింది. భోజనం తర్వాత దానియేలు నిద్రపోయాడు.
పథకం ప్రకారం బెంజిమెన్... రత్నకుమారి సహకారంతో ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న దానియేలు ముఖంపై దిండువేసి బెంజిమెన్ బలవంతంగా నొక్కాడు.

పెద్దగా కేకలు వేశాడు
ఊపిరాడకపోవడంతో నిద్రమత్తులోనే ఉలిక్కిపడిన దానియేలు పెద్దగా కేకలు వేశాడు. పక్క ఇంటిలో నిద్రపోతున్న వృద్ధులు ఆ అరుపులు విని చుట్టుపక్కల వారికి తెలిపారు. దానియేలు అన్న వినుకొండ మోషే వెంటనే అక్కడికి చేరుకున్నాడు.

బెంజిమెన్ నుంచి అతడిని రక్షించాడు
దానియేలుపై జరుగుతున్న హత్యాయత్నాన్ని గమనించి బెంజిమెన్ నుంచి అతడిని రక్షించాడు. ఈలోగా స్థానికులు గుంపులుగా చేరడంతో బెంజిమెన్, రత్నకుమారి అర్ధరాత్రి పరారయ్యారు. దాచేపల్లి పోలీసులుసంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications