Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
Maha Shivratri 2023: మహా శివుడికి ఇష్టమైన రాశులు, వారిపై ఎప్పుడూ ఆది దేవుడి ఆశీర్వాదాలుంటాయి
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులను ఆ శివయ్య ప్రత్యేకంగా ఇష్టపడతాడని చెబుతారు. ఆ రాశుల వారిపై పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. ఆయా రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం శివునికి అకింతమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా, ఆయన ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. దీంతో పాటు ఆ రోజున శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శివుని అనుగ్రహం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఆ పరమ శివుడు తన భక్తుల్లో ప్రతి ఒక్కరి కష్టాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులను ఆ శివయ్య ప్రత్యేకంగా ఇష్టపడతాడని చెబుతారు. ఆ రాశుల వారిపై పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. ఆయా రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశికి అధిపతి మంగళ దేవుడు. అంగారకుడిని శివునిలో భాగంగా భావిస్తారు. ఈ రాశి చక్రం యొక్క స్థానికులు పరమేశ్వరుడి అనుగ్రహంతో వారి జీవితంలో శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు. మేష రాశి వారు సోమవారం నాడు శివుడిని విధిగా పూజించి, శివలింగానికి అభిషేకం చేస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

వృశ్చిక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. దీనితో పాటు ఈ రాశి వారికి శివుని విశేష ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి సోమవారం శివలింగానికి నీటితో అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడి కృపతో వారి కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇది కాకుండా అన్ని రకాల భయాల నుండి వారు విముక్తి పొందుతారు.

మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శివునికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. ఈ రాశికి అధిపతి శని దేవుడు. శని పరమ శివుడికి ప్రియమైన భక్తుడు అని అంటారు. అందుకే మకర రాశి వారికి శివునికి విశేష ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి వారు సోమవారం నాడు శివలింగానికి బేలపత్రం, గంగాజలం, ఆవు పాలు నైవేద్యంగా పెడితే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. దీంతో పాటు అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారని విశ్వాసం.

కుంభ రాశి:
కుంభ రాశికి అధిపతి శని దేవుడుగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి శని దేవుని విశేష అనుగ్రహంతో పాటు పరమ శివుని అనుగ్రహం కుడూ ఉంటుంది. కుంభ రాశి వారు శివుడిని పూజిస్తే సులువుగా ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు. కుంభ రాశి వారు శివలింగంపై నీటితో అభిషేకం చేయాలని అంటారు.



Click it and Unblock the Notifications











