Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Republic Day 2023: భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి దేశవ్యాప్తంగా జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలు చేయబడింది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అందుకే నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవంగా, జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.

రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

1.
1946 డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగ పరిషత్ సమావేశం జరిగింది. దీనిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. రాజేంద్ర ప్రసాద్ చివరు వరకు ఈ పదవిలో కొనసాగారు.
2.
రాజ్యాంగంపై సంతకం చేస్తున్న రోజును చాలా శుభప్రదంగా భావించారు. ఎందుకంటే ఆ రోజు బయట వర్షం కురిసింది.
3.
భారత రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాశారు. ఇటాలిక్ శైలిలో రాసిన రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు.
4.
రాజ్యాంగసభ సభ్యుల మొదటి సెషన్ 1947 డిసెంబర్ 9న జరిగింది. ఈ సమయంలో రాజ్యాంగ పరిషత్లో 207 మంది సభ్యులు ఉన్నారు. ఆ సమయంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఛైర్మన్ గా ఉన్నారు.
5.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశాలు 114 రోజుల పాటు కొనసాగాయి. రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది.
6.
రాజ్యాంగ నిర్మాణ పనులకు దాదాపు 64 లక్షల రూపాయలు వెచ్చించారు. మొత్తం 7635 సమాచారాన్ని రాజ్యాంగ నిర్మాణ పనుల్లో చర్చించారు.
7.
అసలు రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వరా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300(A) ప్రకారం చట్టపరమైన హక్కుగా ఉంచారు.
8.
రాజ్యాంగ ఆత్మగా పిలవబడే ప్రియాంబుల్(ఉపోద్ఘాతం) అమెరికన్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు.
9.
1950 జనవరి 26న అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఆమోదించారు.
10.
సెక్యులర్ అనే పదాన్ని 42వ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
11.
భారత రాజ్యాంగం అసలు కాపీని చేతితో రాశారు. ఈ కాపీ పార్లమెంటు భవనంలోని లైబ్రరీలోని నైట్రోజన్ గ్యాస్ ఛాంబర్లో భద్రంగా ఉంచారు.



Click it and Unblock the Notifications











