Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కార్తీక మాసం స్పెషల్: కర్ణాటక స్టైల్ మసాలా చిత్రాన్నం..10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ
మసాలా చిత్రాన్నం అనేది దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన, సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. దీనిని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంలో లేదా ఉపవాసాల సమయంలో కూడా తయారుచేస్తారు. లంచ్ బాక్స్ రెసిపీగా చాలా ప్రసిద్ధి. తక్కువ సమయంలో, సులభంగా, పోషకాలు అందిస్తూ రుచిగా ఉండే వంటకాన్ని తినాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
సాధారణ చిత్రాన్నం(లెమన్ రైస్)కంటే మసాలా చిత్రాన్నంలో కొబ్బరి, మసాలాలను కలిపి తయారుచేసే ప్రత్యేకమైన పేస్ట్ ఉపయోగించడం వలన దీనికి మరింత ఘాటైన, ప్రత్యేకమైన రుచి వస్తుంది. కార్తీక మాసం సందర్భంగా ఉల్లి,వెల్లుల్లి లేకుండానే మసాలా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-కరివేపాకు
-కొత్తిమీర
-వేరుశెనగపప్పు
-పచ్చిశెనగప్పు
-మినపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-లవంగాలు
-అల్లం తురుము
-దాల్చిన చెక్క
-పచ్చికొబ్బరి
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-నూనె
-ఉప్పు
-పసుపు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒకటింపావు కప్పు కడిగిన బియ్యం, రెండుంపావు కప్పుల నీరు, 1 టీస్పూన్ నూనె,కొంచెం ఉప్పు వేసి అన్నాన్ని వండుకున్నట్లుగా వండుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత చిత్రాన్నం పేస్ట్ తయారీకోసం..మిక్సీ గిన్నెలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం తురుము, 1 రెబ్బ కరివేపాకు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, పిడికెడు కొత్తిమీర కాడలతో సహా వేసి కొంచెం నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు వేసి చిట్లనిచ్చాక ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, అరటేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి.
-తాలింపు బాగా వేగిన తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకు, చిటికెడు ఇంగువ, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేపాలి.
-వేగిన తాలింపులోనే గ్రైండ్ చేసిన చిత్రాన్నం పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. పేస్ట్ లోని చెమ్మ ఆరిన తర్వాత ఇందులో అర టీస్పూన్ పసుపు వేసి 1 నిమిషం వేయించాక ఇందులో ఉడికించి పూర్తిగా చల్లారిన అన్నం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-చివర్లో కావాలనుకుంటే కొంచెం నిమ్మరపం కూడా కలుపుకోవచ్చు. అంతే మసాలా చిత్రాన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications