Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
చిలకలూరిపేట స్పెషల్ స్వీట్ రెసిపి..వేళ్లు కూడా జుర్రుకొని తింటారు,ఎలా చేయాలంటే
పాలతాళికలు ఎప్పుడైనా తిన్నారా? తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పండుగల సమయంలో వీటిని ఎక్కువగా ఇళ్లల్లో చేస్తుంటారు. వినాయకచవితి సందర్భంగా ప్రత్యేకంగా దీనిని ఇంట్లో చేస్తారు. చిలకలూరిపేట, కోనసీయ ఏరియాల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో దీనిని చేస్తుంటారు. వీటి టేస్ట్ ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. చాలా రుచికరంగా ఉండే పాలతాళికలను ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పాలతాళికలు తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యంపిండి
యాలకలు
పాలు
బెల్లం
సగ్గుబియ్యం
నీళ్లు
పాతతాళికలు తయారీ విధానం
-పావు గ్లాస్ సగ్గు బియ్యం 1 గంటపాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ బౌల్ లో రెండు గ్లాసుల బెల్లం వేసి అందులో 1 గ్లాసు నీళ్లు, నాలుగు యాలకలు వేసి కలుపి ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పాకం పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి ఇందులో 1 గ్లాసు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా దగ్గరపడేవరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత దానిని చపాతి పిండి కలిపినట్లు కలుపుకోవాలి.
-తర్వాత చేతికి ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాళికలుగా(పొడవుగా తీగలా) చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో మూడు గ్లాసుల పాలు పోసి బాగా కాగిన తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం పైకి తేలితే ఉడికినట్లే.
-తర్వాత అందులో తాళికలు వేసేయాలి. అసలు కలపకూడదని గుర్తుంచుకోండి. మంటలను సిమ్ లో పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి.
-ఈలోగా ఓ బౌల్ లో 1 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ మెత్తాన్ని స్టవ్ మీద ఉన్న తాళికలలో కొంచెం కొంచెంగా వేసుకోండి. 2 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
-2 నిమిషాల తర్వాత అందులో ముందుగా రెడీ చేసిన బెల్లం పాకం వేసి కలపండి. తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపండి. అంతే పాలతాళికలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





