Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
చిలకలూరిపేట స్పెషల్ స్వీట్ రెసిపి..వేళ్లు కూడా జుర్రుకొని తింటారు,ఎలా చేయాలంటే
పాలతాళికలు ఎప్పుడైనా తిన్నారా? తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పండుగల సమయంలో వీటిని ఎక్కువగా ఇళ్లల్లో చేస్తుంటారు. వినాయకచవితి సందర్భంగా ప్రత్యేకంగా దీనిని ఇంట్లో చేస్తారు. చిలకలూరిపేట, కోనసీయ ఏరియాల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో దీనిని చేస్తుంటారు. వీటి టేస్ట్ ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. చాలా రుచికరంగా ఉండే పాలతాళికలను ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పాలతాళికలు తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యంపిండి
యాలకలు
పాలు
బెల్లం
సగ్గుబియ్యం
నీళ్లు

పాతతాళికలు తయారీ విధానం
-పావు గ్లాస్ సగ్గు బియ్యం 1 గంటపాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ బౌల్ లో రెండు గ్లాసుల బెల్లం వేసి అందులో 1 గ్లాసు నీళ్లు, నాలుగు యాలకలు వేసి కలుపి ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పాకం పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి ఇందులో 1 గ్లాసు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా దగ్గరపడేవరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత దానిని చపాతి పిండి కలిపినట్లు కలుపుకోవాలి.
-తర్వాత చేతికి ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాళికలుగా(పొడవుగా తీగలా) చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో మూడు గ్లాసుల పాలు పోసి బాగా కాగిన తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం పైకి తేలితే ఉడికినట్లే.
-తర్వాత అందులో తాళికలు వేసేయాలి. అసలు కలపకూడదని గుర్తుంచుకోండి. మంటలను సిమ్ లో పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి.
-ఈలోగా ఓ బౌల్ లో 1 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ మెత్తాన్ని స్టవ్ మీద ఉన్న తాళికలలో కొంచెం కొంచెంగా వేసుకోండి. 2 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
-2 నిమిషాల తర్వాత అందులో ముందుగా రెడీ చేసిన బెల్లం పాకం వేసి కలపండి. తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపండి. అంతే పాలతాళికలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
