చేప ఇగురు పులుసు

Fish Iguru Pulusu
కావలసిన పదార్థాలు:
చేపలు: 1/2kg
చింతపండు: రెండు నిమ్మకాయలంత
ఉల్లిపాయలు: 2
పచ్చి మిరపకాయలు: 5
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tbsp
ఉల్లిపాయ: 1tbsp
కొత్తిమీర పేస్టు: 1tbsp
గరంమసాలా: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 2tbsp
బెల్లం పొడి: 1/2tsp
మెంతి పొడి: చిటికెడు
పసుపు: తగినంత
పోపు దినుసులు: 1 2tsp
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ,కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి.
3. తర్వాత అందులోనే చింతపండు పులుసు పోసి కారం, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా మెంతి పొడి వేస్తే గుమ్మనే చేపల పులుసు కి కొద్ది కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి అంతే చేప ఇగురు పులుసు రెడీ.

Story first published: Wednesday, November 10, 2010, 14:39 [IST]
Desktop Bottom Promotion