Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
నోరూరించే ఫిష్ పులావ్
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1/2kg
ఫిష్ ఫిల్లెట్: 1(పెద్ద చేప)
వెల్లుల్లి: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 3-4tbsp
పచ్చిమిర్చి పేస్ట్ : 3tbsp
బాదం: 1cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 2tbsp
నిమ్మరసం: 1tsp
పంచదార: 2-3tsp
కోవా: 2tbsp
బిర్యాని ఆకు: 2
లవంగాలు: 2
యాలకులు: 2
నెయ్యి: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ ల్లో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి దానికి ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్ట్ కలపాలి. అలాగే కొద్దిగా ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఫిష్ ఫిల్లెట్ తీసుకొని శుభ్రం చేసి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చేప ముక్కలకు పసుపు, కారం, నిమ్మరసం, మరియు కొద్దిగా ఉప్పు వేసి మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో సగం భాగం నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, లవంగాలు, యాలకులు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో చేప ముక్కలను కూడా వేసి అతి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అవసరం అయితే కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి చేప ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. తర్వాత అందులోనే మిగిన సగ భాగం నెయ్యి, రైస్ మిశ్రమం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రెండు మూడు నిముషాలపాటు వేయించుకోవాలి. తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. ఐదు నిముషాల తర్వాత మూత తీసి, మంటను పూర్తిగా తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు నీరంతా ఇమిరిపోయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చేప ముక్కను, బాదం పలుకులను, కోవాను వేసి మిక్స్ చేసి మరో ఐదు నిమిషాల పాటు సిమ్ పెట్టి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఫిష్ ఫిల్లెట్ పులా రెడీ. ఏదేని గ్రేవీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే సరి...



Click it and Unblock the Notifications