Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
గోంగూర రొయ్యల కర్రీ: సీ ఫుడ్ స్పెషల్ రిసిపి
సాధారణంగా ఇంట్లో ఎప్పుడూ చేసినవే చేసి బోరుకొడుతుంటే, కొంచెం వెరైటీగా కోరుకుంటాం. కానీ వాటిని సరైన పద్దతిలో తయారుచేయడం తెలియదు. కొత్త వంటలు చేసేటప్పుడు, కాస్త ఓపిక, ఈ వంట మీద అవగాహన, అందుకు కావల్సిన వస్తువులన్నీ ఉన్నాయలో లేదో తెలుసుకొని, అన్ని సిద్దం చేసుకొన్న తర్వాత కొత్తగా వంట తయారుచేయడానికి ప్రయత్నించాలి.
చాలా మందికి రొయ్యల ఫ్రై మాత్రమే తెలుసు, కానీ రొయ్యల గ్రేవీ, రొయ్యల బిర్యానీ, రొయ్యల పులావ్ కూడా తయారుచేసుకుంటారు. ఇవి తినడానికి రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. ఈ సీ ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తాయి. ఇది మంచి ఫ్లేవర్ తో పాటు, మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. సీఫుడ్స్ ఇష్టపడే వారు ఇలా వైరటీ వంటలు తయారుచేసుకొని రుచి చూడవచ్చు.

కావల్సిన పదార్థాలు:
గోంగూర: 1cup
రొయ్యలు: 1/2cup
నెయ్యి: 4tbsp
టమోటోలు: 3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి-ఎండుమిర్చి: 4చొప్పున
పోపుదినుసులు(అన్నీ కలిపి : కొద్దిగా
ధనియాలపొడి: 1/2tsp
పసుపు: 1/4tsp
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు : కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా గోంగూరను తొడిమల నుండి ఆకులను వేరిచేసి శుభ్రంగా కడిగి, తర్వాత గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్ గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఆ తర్వాత అదే పాన్ లో అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
4. అందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
5. కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
6. 5-10నిముషాల తర్వాత, కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. నోరూరించే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications