ప్రాన్స్ ఫ్రైడ్ రైస్

Prawn Fried Rice
కావలసిన పదార్ధాలు:
రొయ్యలు: 1 kg
బియ్యం: 1 kg
నెయ్యి: 1 tbsp
ఉల్లిపాయ పేస్ట్: 1 tbsp
బఠానీలు: 100 grm
అల్లం వెల్లుల్లి: 2 tbsp
పచ్చిమిర్చి: 6
కారం: 1 tsp
కొత్తిమీర: రెండు కట్టలు
లవంగాలు: 8
చెక్క: 8
సాజీర: 1 tsp
యాలకులు: 6
కరివేపాకు: ఒక రెబ్బ
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు

తయారు చేయు విధానము:
1. ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. బఠానీలు ముందు రోజు నానబెట్టుకోవాలి. అలాగే రొయ్యల్ని కూడా పొట్టు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. లవంగాలు, దాల్చిన చెక్క, సాజీర మూడింటిని కలిపి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి బాగా కాగాక ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.
4. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలియ బెట్టాలి. తర్వాత రొయ్యలు కూడా వేసి బాగా వేయించాలి. వేగాక దించేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
5. స్టౌ పై వెడల్పాటి గిన్నె పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులోనే కడిగి ఆరబెట్టుకొన్న బియ్యాన్ని, బఠానీల్ని వేసి వేయించాలి.
6. బాగా వేగాక మసాల పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి గరిటతో బాగా కలపాలి. ఇప్పుడు గ్లాసు బియ్యంకు గ్లాసున్నర నీరు పోసి మూత పెట్టాలి. ఉడికిన తర్వాత దింపుకొని కొత్తిమిరతో గార్నిష్ రెడీ చేసుకోవచ్చు.

Story first published: Tuesday, February 16, 2010, 15:22 [IST]
Desktop Bottom Promotion