బాదం ఫిర్ని రిసిపి: రంజాన్ స్పెషల్

పాలు, బాదం మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే రోజ్ ఫిర్నీ నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డిం, అంటే ఖీర్, పాయసం, వంటిదమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి, పేస్ట్ చేసి పాలతో ఉడికిస్తారు. ఇది ముగలైయ్ కుషన్. ఇది ట్రెడిషనల్ రిసిపి, చూడటానికి నోరూరిస్తూ..కలర్ ఫుల్ గా ఉంటుంది. దీన్ని పిస్తా..బాదాంతో గార్నిష్ చేస్తే మరింత టేస్ట్...మరి ఈ వెరైటీ డిజర్ట్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా..

Badam Phirni Recipe For Ramzan

కావల్సిన పదార్థాలు:
బెల్లం: 4tbsp(పొడి చేసుకోవాలి)
బాదం: 10-15(పొడి చేసుకోవాలి)
పాలు: 3cups
బియ్యం: 1/4cup(నీళ్ళలో నానబెట్టుకోవాలి)
యాలకుల పొడి: 1/2tsp
రోజ్ వాటర్: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా పాలు పోసి కాగనివ్వాలి.
2. తర్వాత బియ్యంనానబెట్టిన నీళ్ళను వంపేసి, తడి బియ్యంను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ బియ్యం పిండి పేస్ట్ కు కొద్దిగా మరిగించిన పాలను పోసి, బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పడు ఈ బియ్యపిండి పాల మిశ్రమాన్ని స్టౌ మీద పెట్టి తిరిగా బాయిల్ చేయాలి.
5. మీడియం మంట మీద చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
6. ఉడుకుతున్నప్పుడే అందులో యాలకుల పొడి మరియు బెల్లం తురుము కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. తక్కువ మంట మీద 5-6నిముషాలు ఉడికించుకోవాలి.
8. చివరగా బాదంను మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం రెడీ అయిన తర్వాత చల్లారనివ్వాలి.
9. చల్లారిని తర్వాత ఫ్రిజ్ లో పెట్టి, అరగంట తర్వాత బయటకు తీసి చల్లచల్లగా అందివ్వాలి.

Story first published: Saturday, June 28, 2014, 19:01 [IST]
Desktop Bottom Promotion