సమ్మర్ స్పెషల్..ఇంట్లోనే రోజ్ మిల్క్ ఇలా చేసుకోండి..మండే ఎండలో చల్లగా ఉంటారు

Posted By:

ప్రస్తుతం ఉదయం నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. సమ్మర్ లో చాలామంది ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ ని తాగుతుంటారు. అయితే రోజ్ మిల్క్..సమ్మర్ లో తాగడానికి బెస్ట్ డ్రింక్. మిట్టమధ్యాహ్నాం ఓ పక్క ఎర్రటి ఎండ..మరోపక్క చల్లటి రోజ్ మిల్క్ తాగుతుంటే ఈ జీవితానికి ఇంతకుమించి ఏం కావాలి అనిపిస్తుంది. చాలామంది సమ్మర్ లో షాపుల దగ్గరకు వెళ్లి రోజ్ మిల్క్ కొనుక్కోని తాగుతుంటారు. అయితే దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రోజ్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

రోజ్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-సబ్జా గింజలు
-రోజ్ వాటర్
-రోజ్ సిరప్
-ఐస్ క్యూబ్స్
-గులాబీ రేకులు
-చక్కెర

రోజ్ మిల్క్ తయారీ విధానం

-ముందుగా అరలీటరు చిక్కటి పాలను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టండి.

-తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టండి.

-కొద్దిసేపటి తర్వాత ఓ పెద్ద గ్లాస్ లేదా బెంబులో ఫిడ్జ్ లో పెట్టిన పాలను పోసి ఇందులో 1 టీస్పూన్ రోజ్ వాటర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, పావు కప్పు రోజ్ సిరప్, నాలుగైదు ఐస్ క్యూబ్ లు,నాలుగైదు గులాబీ రేకులు, నానబెట్టిన సబ్జా గింజలు వేసి మూతపెట్టి 3 నిమిషాలు బాగా షేక్ చేయండి.

-తర్వాత మూత తీస్తే క్రీమీగా రోజ్ మిల్క్ రెడీ. దీన్ని తాగితే అబ్బా ఏముంది అని తీరాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Thursday, February 13, 2025, 12:11 [IST]
Desktop Bottom Promotion