Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
బెంగాలీ మిష్టి పులావ్ -స్పెషల్ స్వీట్ అంట్ ఫ్లేవర్డ్ డిష్...
బెంగాలీ మిష్గీ పులావ్ ఒక రైస్ డిష్. మీకు శక్తినించేటటువంటి ఒక ఆరోగ్యకరమైన ఆహారం. బెంగాల్లో ‘మిష్టి'అంటే స్వాట్ అని అర్ధం. బెంగాలీ మిష్టి పులావ్ లైట్ గా స్వీట్ గా, సువాసన కలిగిన ఫ్లేవర్డ్ రైస్. పెళ్ళిళ్ళు మరియు పండగలకు సాధారణంగా తయారు చేసుకుంటారు. ఈ వంట యొక్క స్పెషాలీటి ఏంటంటే ఎటువంటి గ్రేవీతో అయినా తినేయవచ్చు.
బెంగాలీ మిష్టి పులావ్ ను బాస్మతి బియ్యాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఎందుకంటే బాస్మతి రైస్ సువాసన అద్భుతంగా ఉంటుంది కాబట్టి. సువాసన మాత్రమే కాదు, రుచి కూడా స్పెషల్ గా ఉంటుంది. మరి ఈ స్పెషల్ బెంగాలీ మిష్టి పులావ్ ను మీరు తయారు చేసుకోవాంటే ఈ క్రింది పద్దతిని ఫాలో అయిపోండి...
కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
పసుపు: 2tsp
పంచదార: 3tbsp
లవంగాలు: 4
యాలకలు: 4
బిర్యాని ఆకు: 1
జీడిపప్పు: 2tbsp
ఎండు ద్రాక్ష: 2tbsp
నీళ్ళు : 4cup
నెయ్యి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి, కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి. దాని తర్వాత, నీరు వంపేసి, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో లవంగాలు, యాలకలు, బిర్యాని ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. అవి వేగిన తర్వాత అందులో బియ్యం, పసుపు, పంచదార, మరియు ఉప్పు వేయాలి.
4. వీటన్నింటిని బాగా మిక్స్ చేస్తు 3-4నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5.తర్వాత అందులో నీళ్ళు, జీడిపప్పు పలుకులు మరియు ఎండు ద్రాక్షవేయాలి.
6. ఈ మిశ్రమాన్నంతటిని బాగా ఉడికించాలి, మంటను బాగా తగ్గించి మూత పెట్టి 15నిముషాలు బియ్యం పూర్తిగా ఉండికేంత వరకూ ఉడికించుకోవాలి.
7. బియ్యం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే బెంగాలీ మిస్తీ పులావ్ రెడీ. ఈ పులావ్ ను అలాగే తినవచ్చు. లేదా చికెన్, మటన్ కర్రీ కాంబినేషన్ తో ట్రై చేయండి...



Click it and Unblock the Notifications
