దద్దోజనం:వైకుంఠ ఏకాదశి స్పెషల్

Daddojanam
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1/2kg
పెరుగు: 2cups
పాలు: 1/2ltr
అల్లంతరుగు: 2tsp
పచ్చిమిర్చి: 4
నెయ్యి: 2tbsp
కరివేపాకు: రెండు రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1/2tsp
మినప్పప్పు: 1tbsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 4
కొత్తిమిర తరుగు: 1cup
పసుపు: చిటికెడు

తయారు చేసే పద్ధతి:
1. పాలు మరగించి చల్లార్చి వుంచుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం కొద్దిగా మెత్తగా వండాలి.
2. అన్నం వుడికిన తర్వాత గరిటెతో బాగా మెదుపుకోవాలి. దీనికి పాలు (చల్లార్చినవి), పెరుగు కలపాలి.
3. చిన్న పాన్ లో నెయ్యిపోసి మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పసుపు కరివేపాకు వేయించి ఈ పోపు పెట్టుకోవాలి.
4. ఈ పోపును పాలు, పెరుగు కలిపిన అన్నంలో బాగా కలపాలి. చివరగా కొత్తమిర తరుగును జల్లుకోవాలి అంతే దద్దోజనం రెడీ.

Story first published: Thursday, January 5, 2012, 14:40 [IST]
Desktop Bottom Promotion