Latest Updates
-
డేటింగ్ యాప్లో పరిచయం.. కేఫ్లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే!
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే..
రోజూ తినే కూరలు, పప్పులు, అన్నం బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అందించే ఒక అద్భుతమైన వంటకం తీసి భాత్ ట్రై చేయండి. ఇది బిహార్ రాష్ట్రానికి చెందిన ఎంతో పాపులర్ అయిన కంఫర్ట్ ఫుడ్. వేయించిన అవిసె గింజలు, కమ్మని సుగంధ ద్రవ్యాలు, పుల్లని పచ్చడి, ఉల్లిపాయల క్రంచ్ కలిసి ఈ అన్నానికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది కేవలం రుచికరమైనదే కాదు, ఆరోగ్యానికి పెద్ద పీట వేసే వంటకం.
తీసి భాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు
అవిసె గింజలు (తీసి) - అర కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
సోంపు - అర టీస్పూన్
ఎండు మిరపకాయలు - 3
బిర్యానీ ఆకు - 1
నూనె - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఎర్ర మిరపకాయల నిల్వ పచ్చడి - 2 టీస్పూన్లు
ఉల్లిపాయ - 1
వండిన అన్నం -3 కప్పులు
తీసి భాత్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మంటను సిమ్ లో పెట్టి ఒక కడాయి పెట్టుకోండి. అందులో అవిసె గింజలు వేసి, అవి చిటపటలాడుతూ కమ్మని వాసన వచ్చే వరకు నెమ్మదిగా వేయించండి. ఆ తర్వాత అందులో జీలకర్ర, ధనియాలు, సోంపు, ఎండు మిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి అన్నీ కలిపి దోరగా వేయించండి. వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-మిశ్రమం బాగా చల్లారిన తర్వాత అందులోని బిర్యానీ ఆకును తీసి పక్కన పెట్టేయండి. మిగిలిన దినుసులను మిక్సీ జార్ లో వేసి మెత్తగా లేదా కొద్దిగా బరకగా పొడి చేసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి.
-ఒక చిన్న పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో 1 లేదా 2 ఎండు మిరపకాయలను వేసి కరకరలాడేలా, మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా వేయించుకోండి. కావాలంటే ఎండుమిర్చిని నేరుగా మంట మీద కూడా కాల్చుకోవచ్చు. దీని వల్ల వంటకానికి ఒక నాటు రుచి వస్తుంది.
-ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో మీరు వేయించి పెట్టుకున్న ఎండు మిర్చి, తగినంత ఉప్పు వేసి చేత్తో బాగా నలపండి. దానికి ఎర్ర మిరపకాయల పచ్చడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు జతచేయండి. పచ్చడిలోని పులుపు, ఉల్లిపాయల క్రంచ్, కారం అన్నీ బాగా కలిసేలా చేత్తో మిక్స్ చేయండి.
-చివరగా ఆ బౌల్ లో కొద్దిగా చల్లార్చిన అన్నాన్ని వేయండి. దానిపై మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిని చల్లండి. ఇప్పుడు మసాలా, అన్నం, పచ్చడి ఫ్లేవర్లు అన్నీ ప్రతి మెతుకుకూ పట్టేలా సున్నితంగా కలపండి.
-అంతే నోరూరించే ఆరోగ్యకరమైన బీహారీ స్పెషల్ తీసి భాత్ రెడీ. దీన్ని తింటుంటే ఆ కారం, పులుపు, కమ్మని సుగంధాల రుచి మీ మనసును ఇట్టే దోచేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













