Latest Updates
-
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది? -
ధనుస్సు, సింహం, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 07 మే 2026 -
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా!
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
బిర్యానీ.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరని వారుండరు. భారతీయుల పాలిట ఇదొక ఎమోషన్. ఆదివారం వచ్చినా, ఇంట్లో ఏ చిన్న పండుగ జరిగినా మన ప్లేట్ లో బిర్యానీ ఉండాల్సిందే. అయితే ప్రాణంగా తినే ఈ బిర్యానీ విషయంలో రుచి కోసం మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మన ఆరోగ్యంపై తీవ్రమైన విషపూరిత ప్రభావాలను చూపుతాయని మీకు తెలుసా?

ఇటీవల జరిగిన కొన్ని ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో, బిర్యానీ తిన్న తర్వాత ఏమి తినకూడదో వివరిస్తూ ఆరోగ్య నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బిర్యానీ కొంచెం ఘాటుగా ఉండి, జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అస్సలు చేయకూడని పనులు ఏంటో చూడండి.
టీ లేదా కాఫీ
హెవీగా తిన్న తర్వాత ఓ కప్పు వేడి వేడి టీ తాగితే బాగుంటుందని చాలామందికి అలవాటు. కానీ టీలోని టానిన్స్ బిర్యానీ ద్వారా లభించే ప్రోటీన్లను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పోషకాలు అందకపోగా, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.
బిర్యానీ, పుచ్చకాయ
ముంబైలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఈ కాంబినేషన్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయుర్వేదం, ఆహార శాస్త్రం ప్రకారం.. బిర్యానీ జీర్ణం కావడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.
కానీ పుచ్చకాయ లాంటి నీటి శాతం ఉన్న పండ్లు కేవలం 20-30 నిమిషాల్లోనే అరిగిపోతాయి. బిర్యానీ తిన్న వెంటనే పండ్లు తింటే అవి అరగకుండా కడుపులోనే ఉండిపోయి కుళ్ళిపోవడం మొదలవుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.
పాలు, పాల ఉత్పత్తులకు దూరం
సాధారణంగా బిర్యానీలో చికెన్ లేదా మటన్ వాడతారు. మాంసాహారం, పాలు ఒకదానికొకటి విరుద్ధ ఆహారాలు. బిర్యానీ తిన్న వెంటనే పాలు తాగడం లేదా పాలతో చేసిన స్వీట్లు తినడం వల్ల చర్మ వ్యాధులు, తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రోబయోటిక్ గా పనిచేసే పెరుగు లేదా మజ్జిగను మరీ చల్లగా లేకుండా, మితంగా మాత్రమే వాడాలి.
కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ వద్దు
బిర్యానీలోని కారం తగ్గించుకోవడానికి చాలామంది వెంటనే ఫ్రిజ్ లోంచి తీసిన కూల్ డ్రింక్స్ లేదా చల్లటి నీళ్లు తాగుతుంటారు. ఇది మనం చేసే అతిపెద్ద తప్పు. బిర్యానీ తయారీలో నూనె, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కడుపులోకి చల్లటి నీరు వెళ్లగానే, ఆ నూనె అంతా గడ్డకట్టిపోయి జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్తి వస్తాయి. దీర్ఘకాలంలో ఇది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.

నిపుణుల సూచనలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం బిర్యానీ తిన్న తర్వాత కనీసం 30 నుండి 60 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఎండాకాలంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి బయట తినేటప్పుడు ఆహారం తాజాగా ఉందో లేదో గమనించండి.
ఒకవేళ బిర్యానీ తిన్న తర్వాత వికారం, ఆగని వాంతులు, లేదా తీవ్రమైన కడుపునొప్పి లాంటివి వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అవి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కావచ్చు. వెంటనే డాక్టర్ను సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications