Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Maha Shivratri 2023: తెలంగాణలోని ప్రముఖ శివాలయాలు, అన్నీ దగ్గరే.. ఈ శివరాత్రికి వెళ్లండి
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని ప్రసిద్ధ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహాశివరాత్రి.. గ్రేట్ నైట్ ఆఫ్ లార్డ్ శివ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. పరమశివుని భక్తులు రాత్రంతా మేల్కొని ఉపవాసం ఉండి, పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేసే రాత్రి ఇది.

తెలంగాణలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లే సుప్రసిద్ధ శివాలయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేములవాడ:
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దేవాలయం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ శివాలయం. శ్రీ రాజరాజేశ్వర దేవాలయం పురాతన ఆలయం. ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు వేములవాడలో ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి. గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం వేములవాడ రాజన్న సన్నిధానం. మహా శివరాత్రి వేళ దీపాలు, పూలతో అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది.

కీసరగుట్ట:
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కీసరగుట్ట. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఈ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన మరియు అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో కీసరగుట్ట ఆలయం ఒకటి. ఇక్కడ మహా శివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. వేడుకలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
కీసరగుట్ట శివాలయం ఉత్సవాల్లో ప్రధానమైనది రుద్రాభిషేకం, ఇక్కడ శివుడికి పాలు, తేనెతో అభిషేకం చేస్తారు. అనంతరం రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు.

రామప్ప:
రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయానికే ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. వాస్తు శిల్పి పేరుపై దీనికి రామప్ప అనే పేరు వచ్చింది. కాకతీయులు ఈ గుడిని కట్టించినట్లుగా చరిత్ర చెబుతోంది.
ఈ శివాలయం పూర్తిగా గ్రానైట్, డోలరైట్ కిరణాలు స్తంభాలతో ఉంటుంది. తేలికపాటి పోరస్ ఇటుకలతో కూడిన పిరమిడ్ నిర్మాణంలో ఉంటుంది ఈ ఆలయం.

అలంపూర్ నవబ్రహ్మ ఆలయం:
ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. బాదామి చాళుక్య చక్రవర్తులు నవబ్రహ్మగా పిలిచే 9 శివాలయాల శ్రేణిని నిర్మించారు. శివుడు బ్రహ్మకు సృష్టి శక్తిని ప్రసాదించిన ప్రదేశం అలంపూర్ అని చెబుతారు.
బ్రహ్మ ఉపసర్గ మొత్తం 9 ఆలయాలను సూచిస్తాయి. కుమార బ్రహ్మ, అర్క-బ్రహ్మ, వీర-బ్రహ్మ, బాల-బ్రహ్మ, స్వర్గ-బ్రహ్మ, గరుడ-బ్రహ్మ, విశ్వ-బ్రహ్మ, పద్మ-బ్రహ్మ, తారక-బ్రహ్మ అని ఇక్కడి ఆలయాలకు పేర్లు.

ఛాయా సోమేశ్వరాలయం- నల్గొండ:
11వ, 12వ శతాబ్దాల్లో ఇక్ష్వాకు కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించింది. ప్రధాన మందిరంలోని శివుని లింగం రోజంతా శాశ్వతమైన నీడతో ఉంటుంది. అలా ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ఎంతో అందంగా, కళాత్మకంగా ఉంటుంది. నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలో ఈ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంటుంది.

మహేశ్వరం శివాలయం:
ఈ మహేశ్వరం శివాలయం 350 ఏళ్ల నాటిదని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని శివగంగ అని పిలిచే పుష్కరిణిపై నిర్మించారు. ఇది నీటిలోకి వెళ్లే మెట్లతో ఉంటుంది. పుష్కరిణి చుట్టూ 16 చిన్న చిన్న గర్భాలయాలు ఉంటాయి. వీటిల్లో చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి. ఈ దేవాలయం హైదరాబాద్-శ్రీశైలం హైవేపై హైదరాబాద్ నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.



Click it and Unblock the Notifications











