Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
శివుడిని చెవిటి మల్లన్నఅని ఎందుకు పిలుస్తారు..?
పూర్వం ఒక రాకుమారి శివున్ని పెండ్లాడాలనుకొని, శివున్ని మల్లె పూవ్వులతోనూ, అర్జున పుష్పాలతోనూ పూజించేది. ఒక రోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేదను చూపించి, అది వాలిన చోట వేచి ఉండాలని , తాను వచ్చి పెళ్లాడతానని చెప్పాడు
ఆమెకి మెలుకువచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివున్ని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతి రోజూ ఇచ్చే వారు.

ఒక రోజు పార్వతితో కూడా అక్కడకు శివుడు వచ్చి ఆ రాకుమారిని చూపించి, ఆమె తనను వివాహమాడదలచుకొన్నదని తెలిపాడు . దానికి పార్వతి హేళన చేసింది. శివుడు తన మాటలను నిరూపించదలచి,ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రూపంలో వెళ్లి, ''రాకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడినయ్యి, ఇంతకాలానికి నిన్ను చేరాను, నా ముసలి రూపంను లెక్క చేయక, నన్ను విహహామాడుతావా?'' అని అడిగాడు.

అందుకామె ఒప్పుకుని చెంచులు వద్దన్నా వినక, శివుని వివాహమాడింది. చెంచులు కొత్త అల్లుని కోసం మద్య మాంసాలతో విందు ఏర్పాటు చేస్తే శివుడు అలిగి, విందును అంగీకరించుకుండా వెళ్లిపోసాగాడు.

ఆమె శివున్ని మల్లయ్య...ఓ చెవిటి మల్లయ్య ! అగు...నిలబడు అని గట్టిగా పిలిచిన, శివుడు లెక్క చెయ్యకపోయేసరికి, రాయిలాగా మాట్లాడవేమి; అక్కడే లింగంగా మారిపో అని శపించింది.

ముదసలి రూంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చూసి, ఓసి! బ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపో అని శపించింది.

దాంతో ఆమె శివుని భార్యగా భ్రమరాంబ నామంతో నిలిచిపోయింది. అందుకనే భక్తులు, ఎప్పటికిని, స్వామిని వృధ్ధ మల్లయ్య, ముసలి మల్లయ్య, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు..



Click it and Unblock the Notifications











