Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
శివుడిని చెవిటి మల్లన్నఅని ఎందుకు పిలుస్తారు..?
పూర్వం ఒక రాకుమారి శివున్ని పెండ్లాడాలనుకొని, శివున్ని మల్లె పూవ్వులతోనూ, అర్జున పుష్పాలతోనూ పూజించేది. ఒక రోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేదను చూపించి, అది వాలిన చోట వేచి ఉండాలని , తాను వచ్చి పెళ్లాడతానని చెప్పాడు
ఆమెకి మెలుకువచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివున్ని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతి రోజూ ఇచ్చే వారు.

ఒక రోజు పార్వతితో కూడా అక్కడకు శివుడు వచ్చి ఆ రాకుమారిని చూపించి, ఆమె తనను వివాహమాడదలచుకొన్నదని తెలిపాడు . దానికి పార్వతి హేళన చేసింది. శివుడు తన మాటలను నిరూపించదలచి,ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రూపంలో వెళ్లి, ''రాకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడినయ్యి, ఇంతకాలానికి నిన్ను చేరాను, నా ముసలి రూపంను లెక్క చేయక, నన్ను విహహామాడుతావా?'' అని అడిగాడు.

అందుకామె ఒప్పుకుని చెంచులు వద్దన్నా వినక, శివుని వివాహమాడింది. చెంచులు కొత్త అల్లుని కోసం మద్య మాంసాలతో విందు ఏర్పాటు చేస్తే శివుడు అలిగి, విందును అంగీకరించుకుండా వెళ్లిపోసాగాడు.

ఆమె శివున్ని మల్లయ్య...ఓ చెవిటి మల్లయ్య ! అగు...నిలబడు అని గట్టిగా పిలిచిన, శివుడు లెక్క చెయ్యకపోయేసరికి, రాయిలాగా మాట్లాడవేమి; అక్కడే లింగంగా మారిపో అని శపించింది.

ముదసలి రూంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చూసి, ఓసి! బ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపో అని శపించింది.

దాంతో ఆమె శివుని భార్యగా భ్రమరాంబ నామంతో నిలిచిపోయింది. అందుకనే భక్తులు, ఎప్పటికిని, స్వామిని వృధ్ధ మల్లయ్య, ముసలి మల్లయ్య, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు..



Click it and Unblock the Notifications