Latest Updates
-
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం!
శివుడిని చెవిటి మల్లన్నఅని ఎందుకు పిలుస్తారు..?
పూర్వం ఒక రాకుమారి శివున్ని పెండ్లాడాలనుకొని, శివున్ని మల్లె పూవ్వులతోనూ, అర్జున పుష్పాలతోనూ పూజించేది. ఒక రోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేదను చూపించి, అది వాలిన చోట వేచి ఉండాలని , తాను వచ్చి పెళ్లాడతానని చెప్పాడు
ఆమెకి మెలుకువచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివున్ని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతి రోజూ ఇచ్చే వారు.

ఒక రోజు పార్వతితో కూడా అక్కడకు శివుడు వచ్చి ఆ రాకుమారిని చూపించి, ఆమె తనను వివాహమాడదలచుకొన్నదని తెలిపాడు . దానికి పార్వతి హేళన చేసింది. శివుడు తన మాటలను నిరూపించదలచి,ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రూపంలో వెళ్లి, ''రాకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడినయ్యి, ఇంతకాలానికి నిన్ను చేరాను, నా ముసలి రూపంను లెక్క చేయక, నన్ను విహహామాడుతావా?'' అని అడిగాడు.

అందుకామె ఒప్పుకుని చెంచులు వద్దన్నా వినక, శివుని వివాహమాడింది. చెంచులు కొత్త అల్లుని కోసం మద్య మాంసాలతో విందు ఏర్పాటు చేస్తే శివుడు అలిగి, విందును అంగీకరించుకుండా వెళ్లిపోసాగాడు.

ఆమె శివున్ని మల్లయ్య...ఓ చెవిటి మల్లయ్య ! అగు...నిలబడు అని గట్టిగా పిలిచిన, శివుడు లెక్క చెయ్యకపోయేసరికి, రాయిలాగా మాట్లాడవేమి; అక్కడే లింగంగా మారిపో అని శపించింది.

ముదసలి రూంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చూసి, ఓసి! బ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపో అని శపించింది.

దాంతో ఆమె శివుని భార్యగా భ్రమరాంబ నామంతో నిలిచిపోయింది. అందుకనే భక్తులు, ఎప్పటికిని, స్వామిని వృధ్ధ మల్లయ్య, ముసలి మల్లయ్య, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు..



Click it and Unblock the Notifications