
ప్రతి రోజు మీరు తీసుకునే ఆహారంలో షుగర్ అధికంగా తీసుకుంటే మీ శరీరం ఊబకాయంలా మారుతుంది. అలాగే గుండె సంబంధిత జబ్బులను మరింతగా పెంచే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన పరిశోధకులు తెలిపారు.ఎవరైతే షుగర్ అధికంగా తీసుకుంటారో అలాంటి వారు గుండె సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎమోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన డాక్టర్ మిరియమ్ వోస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్కు చెందిన జర్నల్లో రాసిన తన పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నారు.
తీపి పదార్థం ఎక్కువగానున్న ఆహార పదార్థాలు, పానీయాలలో కలిపే షుగర్ కారణంగా అందులో కేలరీలు అధిక శాతంలో ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయంతోపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తన పరిశోధనలో తెలిపారు.
పానీయాలు తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని, తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 16 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కేలరీలు పెరిగినట్లు తాము గుర్తించినట్లు ఆయన తన పరిశోధనలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే...అత్యధికంగా షుగర్ తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు తదితర జబ్బులు వచ్చే ప్రమాదాలున్నాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. కాగా ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ ను తీసుకోవాలని ఆయన తన పరిశోధనలో వెల్లడించారు. అదే విధంగా పురుషులు రోజుకు 150 కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ను తీసుకోవాలి. ఒకవేళ ఈ మోతాదుకుమించి తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు నీటిని సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు నెట్టివేయబడతాయని ఆయన పరిశోధనలో వెల్లడించారు.
తీపి పదార్థం ఎక్కువగానున్న ఆహార పదార్థాలు, పానీయాలలో కలిపే షుగర్ కారణంగా అందులో కేలరీలు అధిక శాతంలో ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయంతోపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తన పరిశోధనలో తెలిపారు.
పానీయాలు తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని, తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 16 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కేలరీలు పెరిగినట్లు తాము గుర్తించినట్లు ఆయన తన పరిశోధనలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే...అత్యధికంగా షుగర్ తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు తదితర జబ్బులు వచ్చే ప్రమాదాలున్నాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. కాగా ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ ను తీసుకోవాలని ఆయన తన పరిశోధనలో వెల్లడించారు. అదే విధంగా పురుషులు రోజుకు 150 కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ను తీసుకోవాలి. ఒకవేళ ఈ మోతాదుకుమించి తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు నీటిని సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు నెట్టివేయబడతాయని ఆయన పరిశోధనలో వెల్లడించారు.













