Latest Updates
-
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా
వర్షాకాలంలో అధికంగా చుండ్రు.. తగ్గించే చిట్కాలు..

1. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మ రసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి. అరగంటపాటు అలేగే ఉంచిన ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది.
2. వారంలో కనీసం రెండు సార్లయినా తలస్నానం చేయడం తప్పనిసరి. అవి కెమికల్స్ నిండిన షాంపూలకన్నా కుంకుడుకాయ, శీకాయ వంటివైతే బెటర్.
3. కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టించి, గంట తర్వాత తలారా స్నానం చేయాలి. రాతప్రూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
4. గసగసాలను మెత్తని ముద్దలా చేసుకుని తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి, ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.
5. కొబ్బరినూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించాలి. అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి.
6. ఒక కప్పులో కోడిగుడ్డు సొనవేసి దీనిలో ఒకటికి రెండు టేబుల్ స్పూన్లు షాంపూ వేసి కలిపి దీనితో తలస్నానం చెయ్యాలి.
7. తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
8. జుట్టుకు హెర్బల్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రును నివారించవచ్చు. హెడ్ మసాజ్ వల్ల ఉపయోగాలేంటో చూద్దాం. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి తగ్గుతుంది. మసాజ్ మూలంగా రక్తపస్రరణ బాగా జరిగి, స్వేదరంధ్రాలు తెరచుకుని వెంట్రుకలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అంతేగాకుండా మాడుకు చలువ చేస్తుంది.
9 . వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అయితే, ఈ హెడ్ మసాజ్ను ఎవరు పడితే వారు చేసుకోవడం కంటే, నిపుణులతో చేయించుకుంటేనే మెదడుకు, కళ్ళకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది.
10. ఎవరి దువ్వెనలు వారే వాడుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. అలాగే, టవల్ విడిగా ఉంచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో చుండ్రు దూరమవుతుంది. అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది.



Click it and Unblock the Notifications