Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
చలికాలంలో చర్మం పొడిబారుతోందా.. స్కిన్ మాయిశ్చరైజ్ చేయండిలా?

1. చలికాలంలో సబ్బులు ఉపయోగించకుండా ఉండటం మంచిది. పొడిచర్మం ఉన్నవాళ్లు పాలల్లో ఉలవపిండిని కలిపి మర్దనా చేస్తే చర్మం పొడిబారకుండా సున్నితంగా ఉంటుంది.
2. వారానికోసారి గోరు నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత సున్నిపిండితో స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు రాలిపోవడమే కాదు చర్మం సున్నితంగా ఉంటుంది.
3. శనగపిండిలో నువ్వుల నూనె, కొద్దిగా పసుపు, తేనె, ఒక స్పూను పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మర్దనా చేసి పది నిమిషాలు ఆగి కడిగేయాలి. చర్మం మృదువుగా తయారవుతుంది. దీనినే చేతులకూ కాళ్లకూ ఉపయోగించవచ్చు.
4. శీతాకాలంలో దాహం ఎక్కువగా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి.
5. బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తరువాత గోరు నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
6. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
7. చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బును కాకుండా సున్నుపిండిని ఉపయోగించాలి. అంతేకాదు ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
8. గ్లిజరిన్ లో రోజ్ వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లైచేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
9. పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
10. తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని మొఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.



Click it and Unblock the Notifications