Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
అందమే ఆనందం...అందమే ఆరోగ్యం...!

1. ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ కమలా పండు రసం, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం నునుపుదేరి కాంతివంతంగా కనబడుతుంది.
2. ముఖం పైన జిడ్డు చేరనీయకుండా అప్పుడప్పుడు చన్నీటితో సుభ్రపరచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖంపైన మొటిమలు తగ్గి చర్మం నునుపుగా, అందంగా ఏర్పడుతుంది.
3. నిమ్మరసం టేబుల్ స్పూన్, కోడిగుడ్లు తెల్ల సొన రెండు టేబుల్ స్పూన్లు, తేనె రెండు టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ గుజ్జు అర కప్పు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తుంటే చర్మం జిడ్డు తగ్గిపోయి నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది.
4. టొమాటో, బంగాళ దుంపలను కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని 5 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోయి మృదువుగా తయారవుతుంది.
5. రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూన్ గోరువెచ్చని బాదం నూనెతో ముఖం మీద 10 నిమిషాల పాటు వ్యతిరేక దిశలో మర్దనా చేయాలి. మరుసటి ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం నిగారిస్తుంది.
6. కోడిగుడ్డు తెల్ల సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ సన్ ఫ్లవర్ నూనె కలపాలి. ఈ మిశ్రమం ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చర్మం పట్టులా నునుపవుతుంది.



Click it and Unblock the Notifications