పాదాల పగుళ్ల వల్ల సిగ్గుగా ఉందా...?

Skin Care
చలికాలం మొహం నుంచి కాలిగోరు వరకూ శ్రద్ధ పెట్టాల్సిందే. లేదంటే తేమలేని చలిగాలి మన రూపాన్ని కాకి రంగులోకి మారుస్తుంది. అయితే చాలా మంది మొహం, చేతులు మీద పెట్టిన శ్రద్ధ పాదాలమీద పెట్టరు. మొహం నునుపుగా కనిపిస్తుంది. కానీ పాదాలే పగిలి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. సో పాదాల పట్ల స్పెషల్ కేర్ అవసరమే. ఎలా అంటే..

1. ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ ఏదైనా నూనెను తీసుకోవాలి. ఒక నిమిషం పాటు రెండు పాదాలకు నెమ్మదిగా మర్దనా చేయాలి. 10-15 నిమిషాల తరువాత కడిగేయాలి. అలసిన పాదాలకు ఉపశమనం కలిగించడమే కాదు నునుపుగానూ అవుతాయి.

2. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అందులో పాదాలను పావుగంట సేపు నానబెట్టాలి. అనంతరం స్క్రబ్బర్ లేదా నునుపైన రాయితో పాదాలను మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న డెడ్‌స్కిన్ అంతా పోతుంది. పాదాలను ఇప్పుడు చల్లని నీటితో కడిగి మెత్తటి టవల్‌ తో తుడవాలి. పొడిగా ఉన్న పాదాలకు మాయిశ్చరైజర్ రాయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల పాదాలు అందంగా తయారయవుతాయి.

3.కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దానికి కొన్ని పాలు కలపాలి. వీటికి సరిపడా ఓట్స్ పౌడర్ తీసుకుని పాదాలకు మర్దనా చేయాలి. అర్ధగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలపై డెడ్‌స్కిన్ తొలగిపోయి మృదువుగా ఉంటాయి.

4. ఒక బకెట్లో పావు భాగం వరకూ నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్‌ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచాడు వంటసోడా వేసి ఒక అరగంటపాటు కాళ్లు అందులో ఉంచాలి.

5. కాళ్లు పగిలి బాధపెడుతుంటే రోజ్‌వాటర్, గ్లిజరిన్ , నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ఓ గాజుపావూతలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ స్నానం చేయడానికి అర్ధగంట ముందు, లేదా పడుకునేముందు అప్లై చేయాలి. పాదాల పగుళ్లు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.

Story first published: Saturday, January 7, 2012, 15:53 [IST]
Desktop Bottom Promotion