Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
ముఖం - కళ్ళు క్రింద ముడతలు తగ్గించే చిట్కాలు...

ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకొని బొప్పాయి లేదా అరటి గుజ్జుతో ముఖాన్ని మర్దన చేసి తుడవాలి. మినప పప్పు పొడి 2 చెంచాలు, బార్లీ గింజల పొడి 4 చెంచాలు , రెండు చెంచాల కేపోలిన్ లను తోటకూర రసంలో కలిపి ప్యాక్గా చేసి ముఖంపై వేయాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
బాదంపొడి, పాలపొడి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ గులాబి నీటితో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం తాజాగా మృదువుగా వుంటుంది. అలాగే మరుగుతున్న నీళ్లలో యూకలిప్టస్ ఆకులు కానీ యూకలిప్టస్ నూనె కానీ వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజంతా చర్మంపై తేమ వుండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్ రాసుకుంటే మంచిది. మరొక ఉపాయం ఏమిటంటే ఒక టేబుల్ స్పూను తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ముఖం, మెడ భాగానికి రాసుకొని, పదిహేను నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగితే ముఖం మృదువుగా మారుతుంది.
కళ్ళు కింద ముడతలు తగ్గాలంటే: ప్రతిరోజు ఉదయం కాచిన పాల నుండి చెంచా పాల మీగడ తీసుకుని అందులో విటమిన్ ఇ నూనెను వేసి నిమిషం పాటు కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసి పది నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే కళ్ల చుట్టూ వుండే ముడతలను తగ్గించుకోవచ్చు.
కళ్ళ కింద ముడతలు పోవాలంటే, ఒక కప్పు నీళ్ళలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున ఈ నీళ్ళలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని కడుక్కోవాలి.
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో బొప్పాయి. గుడ్డు, చేపలు, పాలు వుండేలా చూసుకోవాలి
చేతులు మృదువుగా వుండాలంటే : చేతులకు పట్టే మురికి, డెడ్ స్కిన్ పోవాలంటే చేతుల్ని ఓ రెండు నిమిషాలు వేడినీళ్ళలో వుంచాలి. చర్మం మెత్తబడ్డాక ఉప్పు కలిపిన నిమ్మికాయ రసం రాసి పాత టూత్ బ్రష్ తో నెమ్మదిగా శుభ్రం చేయాలి. తరువాత మాయిశ్యరైజర్ రాసుకున్నట్లైతే చర్మంలోని ముడతలు క్రమంగా తగ్గుతాయి.
ఒక గిన్నెలో ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్లు పచ్చిపాలు, ఆర స్పూన్ గంధం పొడి చేసి బాగా కలిపిప చేతికి ప్యాక్ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేయటం వల్ల చేతులు మృదువుగా అవుతాయి.



Click it and Unblock the Notifications