Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
వాలెంటైన్ డే స్పెషల్ అట్రాక్షన్ కోసం ఫ్రూట్ ఫేస్ ప్యాక్

1. కీరకాయను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి అందులో పెసరపిండి, దాల్చిన చెక్క పొడిని వేసి కలపి పెట్టుకొని, చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ రాత్రి వేసుకుంటే ఉదయపు బడలిక అంతా మటుమాయమై రిలాక్సేషన్ తోపాటు చర్మకాంతి కూడా పెరుగుతుంది.
2. బొప్పాయి గుజ్జులో తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్, మీగడ, కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి, మెడకు, తలకు రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటిలో కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రాస్తుంటే చర్మం పొడిబారదు. నల్లబడదు.
3. పీచ్, స్ట్రాబెరీ, ఏప్రికాట్, కివీ (సూపర్మార్కెట్లలో లభిస్తాయి)పండ్లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి. ఈ పండ్ల జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం,కొద్దిగా గ్లిజరిన్, కొద్దిగా తేనె, కొన్ని కాచిన పాలు కలిపి ఈ మిశ్రమాన్ని ఒళ్లంతా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మృదువుగా మారిన చర్మం కొత్తమెరుపు సంతరించుకుంటుంది.
4. తగినంత మామిడి గుజ్జులో చెంచా చొప్పున తేనె, పెరుగు తీసుకొని బాగా కలిపి, ముఖం, మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. ఐదు నిమిషాలు సున్నితంగా మర్దన చేసి వదిలేయాలి. కొద్దిసేటపటి తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చాలు. ఇలా వేసవంతా రోజు మార్చి రోజు ఈ పూత వేసుకోగలిగితే.. చర్మం పసిమిచాయతో మెరిసిపోతుంది.
5. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పని చేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, కొద్దిగా తేనె కలిపి పూతలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది.
6. పుచ్చకాయ చర్మాన్ని చాలా త్వరగా చల్లబరుస్తుంది. రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు లో కొద్దిగా తేనె, టీస్పూన్ ముల్తానీమట్టి తీసుకుని అన్నింటినీ కలిపి చర్మానికి పూత వేయాలి. దీనివల్ల ఎండకు ఎర్రగా మారిన చర్మంలో చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. అందంగానూ మారుతుంది.



Click it and Unblock the Notifications