Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
పాలతో పాలరాతి బొమ్మలా మెరిసిపోండి..!!
ఎన్నో ఆహార ప్రయోజనాలు కలిగి ఉన్న పాలను నిత్యం తీసుకుంటూ ఉంటాం. రోజూ పాలు తాగడం వల్ల కాల్షియం సమృద్ధిగా అందుతుంది. ముఖ్యంగా మహిళలు.. రోజువారీ డైట్ లో పాలను చేర్చుకోవాలి. అయితే కేవలం హెల్త్ బెన్ఫిట్స్ మాత్రమే కాదు.. అనేక బ్యూటీ బెన్ఫిట్స్ కూడా పాలలో దాగున్నాయి. పాలతో రకరకాలుగా ముఖానికి మర్దనా చేయడం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.
రోజూ ఒక్క గ్లాసు పాలు త్రాగితే కలిగే ప్రయోజనాలెన్నో మీకు తెలుసా...!
పాలను రోజ్ వాటర్ తో కలిపి చర్మానికి తరచూ అప్లై చేయడం వల్ల నిగారిస్తుంది. అలాగే పాలలో కొంచెం ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం ముఖానికి మసాజ్ చేస్తే.. మొటిమలు తగ్గిపోయి.. ఫేస్ లో గ్లో పెరుగుతుంది. పాలతో శరీరాన్ని మర్దనా చేసుకుని.. కాసేపటి తర్వాత స్నానం చేస్తే.. పాలరాతి సోయగం మీ సొంతం.

పావుకప్పు పాలల్లో చెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. పూర్తీగా ఆరిన తర్వాత స్నానం చేస్తే.. నలుపుదనం తగ్గిపోతుంది. అలాగే మృతకణాలు తగ్గిపోయి చర్మం స్మూత్ గా తయారవుతుంది.
పాలు ఎందుకు తాగాలి ? పాలతో పొందే ప్రయోజనాలేంటి ?
శనగపిండి, పాలు చర్మ సౌందర్యానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, పావు కప్పు పాలు, స్పూన్ తేనె బాగా కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. కాసేపు మర్దనా చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే.. స్కిన్ స్మూత్ గా మారుతుంది. గ్లోయింగ్ కూడా పెరుగుతుంది.

కొంతమందికి జిడ్డు చర్మం వేధిస్తుంటుంది. అలాంటప్పుడు పాలు చక్కటి పరిష్కారం. పచ్చిపాలలో ఒక స్పూన్ తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. ఆరనివ్వాలి. బాగా ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
శోభనానికి వధువు పాలు తీసుకెళ్లడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
పొడిచర్మం ఉన్నవాళ్లు గుడ్డులోని తెల్లసొన, ఒక టీ స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. స్నానం చేస్తే.. పొడిచర్మం పోయి.. స్కిన్ స్మూత్ గా తయారవుతుంది. తరచుగా ఈ ప్యాక్ అప్లై చేస్తుంటే.. చర్మం పొడిబారే తత్వం నుంచి బయటపడుతుంది.



Click it and Unblock the Notifications