Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
పాలతో పాలరాతి బొమ్మలా మెరిసిపోండి..!!
ఎన్నో ఆహార ప్రయోజనాలు కలిగి ఉన్న పాలను నిత్యం తీసుకుంటూ ఉంటాం. రోజూ పాలు తాగడం వల్ల కాల్షియం సమృద్ధిగా అందుతుంది. ముఖ్యంగా మహిళలు.. రోజువారీ డైట్ లో పాలను చేర్చుకోవాలి. అయితే కేవలం హెల్త్ బెన్ఫిట్స్ మాత్రమే కాదు.. అనేక బ్యూటీ బెన్ఫిట్స్ కూడా పాలలో దాగున్నాయి. పాలతో రకరకాలుగా ముఖానికి మర్దనా చేయడం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.
రోజూ ఒక్క గ్లాసు పాలు త్రాగితే కలిగే ప్రయోజనాలెన్నో మీకు తెలుసా...!
పాలను రోజ్ వాటర్ తో కలిపి చర్మానికి తరచూ అప్లై చేయడం వల్ల నిగారిస్తుంది. అలాగే పాలలో కొంచెం ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం ముఖానికి మసాజ్ చేస్తే.. మొటిమలు తగ్గిపోయి.. ఫేస్ లో గ్లో పెరుగుతుంది. పాలతో శరీరాన్ని మర్దనా చేసుకుని.. కాసేపటి తర్వాత స్నానం చేస్తే.. పాలరాతి సోయగం మీ సొంతం.

పావుకప్పు పాలల్లో చెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. పూర్తీగా ఆరిన తర్వాత స్నానం చేస్తే.. నలుపుదనం తగ్గిపోతుంది. అలాగే మృతకణాలు తగ్గిపోయి చర్మం స్మూత్ గా తయారవుతుంది.
పాలు ఎందుకు తాగాలి ? పాలతో పొందే ప్రయోజనాలేంటి ?
శనగపిండి, పాలు చర్మ సౌందర్యానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, పావు కప్పు పాలు, స్పూన్ తేనె బాగా కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. కాసేపు మర్దనా చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే.. స్కిన్ స్మూత్ గా మారుతుంది. గ్లోయింగ్ కూడా పెరుగుతుంది.

కొంతమందికి జిడ్డు చర్మం వేధిస్తుంటుంది. అలాంటప్పుడు పాలు చక్కటి పరిష్కారం. పచ్చిపాలలో ఒక స్పూన్ తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. ఆరనివ్వాలి. బాగా ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
శోభనానికి వధువు పాలు తీసుకెళ్లడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
పొడిచర్మం ఉన్నవాళ్లు గుడ్డులోని తెల్లసొన, ఒక టీ స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. స్నానం చేస్తే.. పొడిచర్మం పోయి.. స్కిన్ స్మూత్ గా తయారవుతుంది. తరచుగా ఈ ప్యాక్ అప్లై చేస్తుంటే.. చర్మం పొడిబారే తత్వం నుంచి బయటపడుతుంది.



Click it and Unblock the Notifications