Latest Updates
-
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్బాట్.!
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది..
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల సామర్థ్యం తగ్గడం సహజం. అయితే క్రమం తప్పకుండా చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్(కండరాల బలం పెంచే వ్యాయామాలు - బరువులు ఎత్తడం లాంటివి) వల్ల గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు దరిచేరవని, అసలు మరణ ప్రమాదమే గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక రిపోర్ట్ ఈ ఆసక్తికరమైన వాస్తవాలను బయటపెట్టింది.

దాదాపు 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ అధ్యయనంలో మొత్తం 147,374 మంది వ్యక్తుల ఆరోగ్య డేటాను పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. ఈ ముప్పై ఏళ్ల వ్యవధిలో వారిలో 35,798 మంది మరణించినట్లు నమోదైంది. ఈ సుదీర్ఘ అధ్యయనంలో తేలిన అద్భుతమైన విషయం ఏమిటంటే.. వారానికి కేవలం 90 నుంచి 120 నిమిషాల పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వారిలో ఏ కారణం చేతనైనా సరే అకాల మరణం సంభవించే ప్రమాదం 13 శాతం మేర తక్కువగా ఉంది.
ముఖ్యంగా నేటి కాలంలో ప్రధాన సమస్యగా మారిన గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ముప్పు 19 శాతం తగ్గగా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం ఏకంగా 27 శాతం వరకు తగ్గినట్లు తేలింది.

ఏరోబిక్స్ కూడా తోడైతే అద్భుతమే
కేవలం బరువులు ఎత్తడం మాత్రమే సరిపోతుందా అంటే..ఏరోబిక్ వ్యాయామాలు కూడా దానికి తోడైతే ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. నడక, పరుగు, సైక్లింగ్, ఈత వంటి ఏరోబిక్ కార్యకలాపాలను వారానికి కనీసం 150 నిమిషాల పాటు చేసిన వారిలో మెరుగైన ఫలితాలు కనిపించాయి.
అసలైన మ్యాజిక్ ఎక్కడ ఉందంటే.. వారానికి 30-44 ఎంఈటీ (MET) గంటల ఏరోబిక్ వ్యాయామంతో పాటు, 60 నుంచి 119 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కలిపి చేసిన వారిలో మొత్తం మరణ ప్రమాదం ఏకంగా 45 శాతం వరకు తగ్గింది. ఒకవేళ ఏరోబిక్ కార్యకలాపాలు 45 ఎంఈటీ గంటల కంటే ఎక్కువగా ఉంటే, ఈ మరణ ముప్పు 53 నుంచి 58 శాతం వరకు దూరమైనట్లు అధ్యయనం తేల్చింది.
ముఖ్య విషయం ఇదే
అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కదా అని రోజంతా జిమ్ లో గంటల తరబడి బరువులు ఎత్తేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ను వారానికి 120 నిమిషాల కంటే ఎక్కువగా (అంటే రోజుకు 20 నిమిషాల కంటే ఎక్కువ) చేయడం వల్ల శరీరానికి దక్కే అదనపు ప్రయోజనాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు స్పష్టంగా తేల్చి చెప్పారు.
దేనికైనా మితం అన్నది చాలా ముఖ్యం. ప్రతిరోజూ నడక, రన్నింగ్ వంటి మితమైన ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూనే, దానికి వారానికి రెండు లేదా మూడు రోజులు మితమైన స్థాయిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications