Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
Viral Videos : నోయిడాలో ఫ్లాట్లో పేలిన ఏసీ.. బస్సులోపలే కొట్టుకున్న తెలంగాణ మహిళలు..!
ఎండా కాలంలో ఏసీలున్న వారు అప్రమత్తం కావాల్సిన అవసరం వుంది. అవి ఎప్పుడైనా పేలిపోవచ్చు. నోయిడాలోని ఓ దృష్యం ఇప్పుడు ఏసీలు వున్నవారిని ఆందోళనకు గురిచేస్తుంది. నోయిడాలోని ఓ ఫ్లాట్లో ఏసీ పేలిపోవడంతో మొత్తం ఫ్లాట్ లో మంటలు అంటుకొని అన్ని వస్తువులూ కాలిపోయాయ్.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఏసీలు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పేలడం ఇప్పుడు భయాందోళనకు గురిచేస్తుంది. దీని పై నెటిజెన్లు రకరకాలగా స్పందిస్తున్నారు. కంపెనీ చీప్ క్వాలిటీ వున్న మెటీరియల్ ఉపయోగించడం వల్లే ఇలా జరిగిందని యూజర్ కామెంట్ చేశాడు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో యూపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఇంట్లో దొంగలు దూరారు. ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి, స్క్రూ డ్రైవర్లు, ఇనుప రాడ్లతో ఇంటిలోకి చొరబడ్డారు. ఇంట్లో వున్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరించారు. చెత్తసేకరించాలనే నెపంతో వీరు ఇంట్లోకి ప్రవేశించారు. అయితే దొంగతనానికి వచ్చిన వాళ్లంతా ఆడవాళ్లే కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
మండుతున్న ఎండల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో నీళ్ల కొరత తీవ్రంగా వుంది. ఢిల్లీ గల్లీల్లోకి వచ్చిన నీళ్ల ట్యాంకర్కోసం ఢిల్లీ వాళ్లు ఒకరిపై ఒకరు ఎగబడుతున్నారు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. వివేకానంద క్యాంపు వారికి సంబంధించిన నీళ్ల ట్యాంకర్ అక్కడికి ప్రవేశించగానే చాలా మంది మగశాళ్లు బిందెలు పట్టుకొని ట్యాంకర్ పైకి ఎక్కడాన్ని మనం చూస్తాం. కేవలం కొన్ని సెకెన్లలోనే 20 మంది వరకు ట్యాంకర్పైకి ఎక్కుతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి బ్రతుకు బతకడం కంటే ఎవరి ఊళ్లోకి వారు వెళ్లడం మేలను అంటున్నారు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. ఇందులో ఆశ్చర్యం కలిగించే మరో విషయమేంటంటే పోలీసులు ఇదంతా చూస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో వున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరో యూజర్ కామెంట్ చేశాడు.
తెలంగాణలో బస్సు ఫ్రీ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్లున్న ఓ ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళా ప్రయాణికులు కొట్టుకున్నారు. వారి మధ్య గొడవ దేనికి సంబంధించి వచ్చిందో తెలియదు కానీ ఇద్దరూ బాగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. సీటు ఏమీ ఇంటికి తీసుకెళ్లరు కదా ఎందుకు ఇంత గొడవ ఒక ఒక యూజర్ కామెంట్ చేశాడు. బస్సులు ఫ్రీగా పెడితే ఇలాంటి డ్రామాలు, గొడవలే జరుగుతాయని మరో యూజర్ కామెంట్ చేశాడు.
కేవలం టోల్ చార్జీలు అడిగినందుకు బుల్ డోజర్ డ్రైవర్కు కోపం వచ్చింది. దీంతో అదే బుల్ డోజర్తో రెండు టోల్ బూత్లను పడగొట్టాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ డ్రైవర్ను పట్టుకొని బాగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Click it and Unblock the Notifications