Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Baba Vanga Predictions: ప్రపంచం అంతం ఆ సంవత్సరంలోనే!..వచ్చే 20 ఏళ్లలో ఈ దేశాలలో ఇస్లామిక్ పాలన
మన తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మంగారు అనే పేరు తెలియని వారు ఉండరు. దీనికి కారణం భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన అంచనాలు చాలావరకు నిజమయ్యాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామంది భవిష్యత్తు గురించి అంచనాలు వేశారు. వారిలో బాబా వంగా ఒకరు. చాలామంది బాబా వంగ అంటే మగ వ్యక్తి అని పొరబడుతుంటారు, వాస్తవానికి ఆమె మహిళ. ఆమె అసలు పేరు వంగేలియా పండీవ గుస్తేరోవా(Vangeliya Pandeva Gushterova). బాబా వంగ అని పిలుస్తుండేవారు.
12 ఏళ్ల వయస్సులో ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన బాబా వంగ..తన జ్ఞానదృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను చూసే అద్భుతమైన శక్తిని పొందినట్లు నమ్ముతారు. 1966లో బాబా వంగా మరణించారు. అయితే భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు బాబా వంగా ముందుగానే చెప్పింది. వాటిలో చాలా నిజమని నిరూపించబడ్డాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం,చెర్నోబిల్ డిజాస్టర్ వరకు చాలావాటిని ఆమె ముందే ఊహించారు. అయితే ఆమె వేసిన అంచనాలలో ఒకటి కొన్ని దేశాలను ప్రస్తుతం కలవరపెడుతోంది.

యూరప్ ముస్లింల చేతుల్లోకి
యూరోప్ లో భారీ సంఘర్షణ జరుగుతుందని, 2043 నాటికి ముస్లింల ఆధిపత్యంలోకి యూరప్ వెళ్లిపోతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. అంతేకాకుండా 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా తిరిగి కమ్యూనిస్టు పాలన వస్తుందని అంచనా వేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..5079లో ఒక సహజ సంఘటన కారణంగా ప్రపంచం అంతమవుతుందని ఆమె అంచనా వేశారు.
బాబా వంగా ప్రసిద్ధ అంచనాలలో మరికొన్ని
-బాబా వంగా ప్రకారం 2028లో ప్రపంచ ఆకలి నిర్మూలన జరుగుతుందని,మానవులు శుక్రుడిని చేరుకోవడంతో పాటు ఒక కొత్త శక్తి వనరు సృష్టించబడుతుంది.
-2033లో వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరగడం ఒక ప్రధాన సమస్యగా మారుతుందని, ప్రమాదానికి కారణమవుతుందని బాబా వంగా అంచనా వేశారు.
-2043లో యూరప్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని,ప్రధానంగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోతుందని జోస్యం చెప్పారు.
-2046లో సింథటిక్ అవయవాలు భారీగా ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు
-2066లో అమెరికా పర్యావరణ విధ్వంసక ఆయుధాన్ని కనుగొంటుందని బాబా వంగా అంచనా వేశారు.



Click it and Unblock the Notifications











