Chandrayaan-3:చంద్రయాన్ కి సంబంధించిన ఫోటోలను ఇస్రో పంచుకుంది: విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావడానికి ఇక ఒక్కరోజే

Indian Space Research Organization (ISRO)భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఒక రోజు మాత్రమే ఉంది. దాని కంటే ముందు సోమవారం (ఆగస్టు 21) చంద్రుని ప్రత్యేక చిత్రాలను పంచుకుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని వైపు నుండి చిత్రాలను తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది.

చంద్రయాన్-3 మిషన్‌పై అప్‌డేట్ ఇస్తూ, ఇస్రో చంద్రుని ఉపరితల చిత్రాలను ట్వీట్ చేసింది. హజార్డ్ డిటెక్షన్ మరియు అవాయిడెన్స్ కెమెరాతో విక్రమ్ ల్యాండర్ చంద్రుని అవతలి వైపు చిత్రాలను బంధించిందని ఇస్రో తెలిపింది.

Indian Space Research Organization (ISRO)

ఇస్రో నాలుగు ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. "ఇవి ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా (ఎల్‌హెచ్‌డిఎసి) తీసిన చంద్రుని చిత్రాలు. రాళ్ళు లేదా లోతైన కందకాలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సహాయపడుతుంది" అని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్-3 తన లక్ష్యానికి చాలా దగ్గరగా ఉండటంతో, ఇస్రో విక్రమ్ ల్యాండర్‌పై నిశితంగా గమనిస్తోంది. ఇస్రో ప్రకారం, భారతదేశం యొక్క చంద్రయాన్ -3 దాని నిర్దేశిత మార్గంలో వేగంగా దూసుకుపోతోంది. ఆగస్ట్ 23న ల్యాండ్ కావాల్సి ఉంది.

విక్రమ్ ల్యాండర్‌పై ఇస్రో నిఘా ఉంచింది. విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 25 కి.మీ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్ రెండుసార్లు డీబూస్ట్ అయింది. కానీ ఇస్రో ప్రకారం, చంద్రయాన్ మిషన్‌లో ఇప్పటివరకు అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది.

ఈసారి చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో అన్ని ప్రయత్నాలు చేసింది. 2019 పరాజయం నుంచి ఇస్రో చాలా నేర్చుకుంది.

Indian Space Research Organization (ISRO)

చంద్రునిపై అంతరిక్ష నౌకను సురక్షితంగా ల్యాండ్ చేయడం గొప్ప సాహసం. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండ్ చేయడం సవాలు. చంద్రుడిపై ల్యాండ్ కానున్న ల్యాండర్ పేరు విక్రమ్. దాని బాడీలో ప్రగ్యాన్ అనే రోవర్ కూడా ఉంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాలి. పోయినసారి సరిగ్గా ల్యాండింగ్ కాకపోవడంతో మొత్తం ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది.

ఈసారి చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన తర్వాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు రానుంది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ తన ఇతర పనులను ప్రారంభించనుంది. విక్రమ్ ల్యాండర్ లోపల చంద్రునిపై ఉష్ణోగ్రతను కొలిచే యంత్రం ఉంది. అలాగే చంద్రుడి ఉపరితలంపై భూకంపం వస్తే దానిని గుర్తించే యంత్రం ఉంటుంది. చంద్రునిపై ఉన్న ప్లాస్మా మొత్తాన్ని కొలుస్తుంది. తరువాత ఈ సమాచారం అంతా భూమికి పంపబడుతుంది.

Story first published: Wednesday, August 23, 2023, 15:11 [IST]
Desktop Bottom Promotion