Latest Updates
-
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది!
రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
రామాయణంలో శ్రీరాముడు లంకలో ఉన్న సీతను కలవడానికి సముద్రం మధ్యలో వారధి కట్టాడని పురాణాలు స్పష్టం చెబుతున్నాయ్. ఆ వారదే ఇప్పుడు మనము చెప్పుకుంటున్న శ్రీలంకకు, భారత్కు మధ్యనున్న ఆడమ్స్ బ్రిడ్జ్. వందల సంవత్సరాలను దీనిపై అనేక చర్చ జరుగుతోంది. ఈ ఆడమ్స్ బ్రిడ్జ్నే మనము రామసేతుగా గుర్తిస్తాము. ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ను పాక్ స్ట్రెయిట్ అని కూడా పిలుచుకుంటాం. ఇది నిజంగా శ్రీరాముడే కట్టాడా, మనుషులు నిర్మించినదా లేక సహజంగా ఏర్పడిందా అనే దానిపై వివాదాలు, గొడవలు చెలరేగుతూనే ఉన్నాయ్.

కార్బన్ డేటింగ్ మిస్టరీ
ఆడమ్స్ బ్రిడ్జ్గా చెప్పబడే రామసేతుపై పరిశోధకులు కార్బన్ డేటింగ్ పరీక్షను చేపట్టారు. కార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణాల వయసు తెలుస్తోంది. ఆ రిపోర్టులో రామసేతును క్రీస్తు పూర్వం 5వేల సంవత్సరం క్రితం నిర్మించినట్లు బయటపడింది. రామాయణం కూడా సరిగ్గా అప్పుడే జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయ్. సీతను విడపించడానికి కట్టిందే రామసేతు అని అందుకే రామభక్తులు బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు.
రామసేతు నిర్మాణం
రామాయణం కేవలం కల్పితమే రాముడు సీత కోసం తేలియాడే రాళ్లతో వారధిని నిర్మించలేదని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న వారధిని కాదని అనలేము. అయితే ఈ రామసేతు నిర్మాణం అసలు ఎలా జరిగిందనేదానిపై మరింత స్పష్టత రావలసి ఉంది.
నడవగలిగేలా రామసేతు వారధి
16వ శతాబ్దం వరకు కూడా రామసేతు వారధిపై మనుషులు సురక్షితంగా నడిచే పరిస్థితి ఉండేదని చరిత్ర చెబుతోంది. సముద్ర మట్టం కొంత పెరగడం వల్ల మూడు ఫీట్ల లోతులో ఉన్న రామసేతు బ్రిడ్జ్ ఇప్పుడు 30 ఫీట్ల లోతులో ఉందని అంటున్నారు.
ఫిప్స్ వెళ్లే పరిస్థితి లేదు
రామసేతు బ్రిడ్జ్ చుట్టుపక్కల నుంచి షిప్స్ వెళ్లే పరిస్థితి లేదు. సముద్రంలో రామసేతు బ్రిడ్జ్ తక్కువ లోతులో ఉండడం వల్ల ఓడల రవాణాకు అంతరాయం కలుగుతోంది. కాబట్టి భారత్, శ్రీలంకకు సంబంధించిన ఓడలు రామసేతు గుండా ప్రయాణించడానికి వీలు లేకుండా ఉంది.
సేతు సముద్రం ప్రాజెక్టు
సేతు సముద్రం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని రామభక్తులు కోరుకుంటున్నారు. భారత్లోని పంబన్ దీవి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలిపే సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామభక్తులుఈ ప్రాజెక్టును చేపట్టవద్దని, ప్రాజెక్టు వల్ల రామసేతును కూల్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తేలియాడే రాళ్లు
రామాయణంలో శ్రీరాముడి నామం రాళ్లపై రాసినప్పుడు ఆ రాళ్లు తేలి అవే రాళ్లు సముద్రంపై వారధిగా నిలిచాయని పురాణం చెబుతోంది. అలాంటి తేలియాడే రాళ్లు ఎన్నో మనము రామేశ్వరం వద్ద చూడవచ్చు. అయితే అగ్ని పర్వతానికి సంబంధించిన కొన్ని రాళ్లకు శాస్త్రీయంగా తేలియాడే సామర్ధ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications