Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
LIVE VIDEO: చైనాలో ప్రస్తుతం పరిస్తతి ఎలా ఉందో చూడండి.. కచ్చితంగా షాక్ అవుతారు
చైనాలో వ్యాపిస్తున్న HMPV వైరస్ కేసులో మన దేశంలో కూడా నమోదవుతుండడంతో ప్రజలందరూ భాయాందోళనలు చెందుతున్నారు. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఈ వైరస్ ప్రమాదకరమైనదని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ నివశిస్తున్న మన భారతీయులు ఏమంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రశాంతంగా..
మన దేశంలో HMPV వైరస్ గురించి అవసరమైన చర్చ జరుగుతుంది. చైనాలో చాలా వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుందని, పదుల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారని చెబుతున్నారు. కానీ రియాలిటీ అలా లేదు. అక్కడ నివసిస్తున్న మన భారతీయులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోలను బట్టి చూస్తే అక్కడ అంతా ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు చైనాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే?
కేరళకు చెందిన పలువురు, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి, అలాగే ఉత్తర భారత దేశానికి చెందిన మరికొందరు చైనాలో ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నాలు చేశారు. చైనాలో ప్రస్తుతం ఎలాంటి భయాందోళనలు లేవని, ప్రశాంతమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ బయటికి వచ్చి తమపని తాము చేసుకుంటున్నారని, చిన్న పిల్లలు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయట తిరుగుతున్నారని వివరించారు.
ఈ మేరకు మాల్స్, ఆఫీస్, బయటి రోడ్లన్నీ తిరుగుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. ఏమి లేని దానికి ఎందుకంత పుకారు సృష్టిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కావాలనే కొందరు ఈ పనులు చేస్తున్నారని, ప్రజలు ఈ వైరస్ గురించి వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకూడదని చెబుతున్నారు. కాకపోతే ముందస్తు జాగ్రత్తగా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులను శుభ్రం చేసుకుంటూ మాస్కులు వినియోగించాలని కోరుతున్నారు. చికిత్స కంటే నివారణ మంచిదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల లోపు ఈ లక్షణాలు బయటపడతాయి. ఒకవేళ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉంటే కొంత జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరగడం మంచిది. అలాగే స్వయం శుభ్రత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకుంటే చాలు.



Click it and Unblock the Notifications











