Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
మిస్సైన మనిషి... పైతాన్(కొండ చిలువ)పొట్టలో శవమైన వీడియో..
ఈ మద్యన సోషియల్ మీడియాలో బాగా పాపులరై..వైరల్ గా మారిన వీడియో ఒకటి, ఒళ్లు గొగుర్పొచేలా చేస్తుంది. పామును చూస్తేనే ఆమడం దూరం పరిగెత్తే ఈ రోజుల్లో, ఒక పైతాన్ ఏకంగా మనిషిని మింగేసింది. మరి ఈ షాకింగ్ సంఘటన
ఈ మద్యన సోషియల్ మీడియాలో బాగా పాపులరై..వైరల్ గా మారిన వీడియో ఒకటి, ఒళ్లు గొగుర్పొచేలా చేస్తుంది. పామును చూస్తేనే ఆమడం దూరం పరిగెత్తే ఈ రోజుల్లో, ఒక పైతాన్ ఏకంగా మనిషిని మింగేసింది. మరి ఈ షాకింగ్ సంఘటన ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..

ఇండోనేషియాలోని సుల్వేసి ద్వీపంలో..
తోటలో పని చెయ్యడానికి వెళ్లిన రైతును 26 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ (పైతాన్) మింగేసి పొట్టనపెట్టుకున్న సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలోని సుల్వేసి ద్వీపంలో అక్బర్ సలుర్బీ (25) అనే యువకుడు కొండచిలువకు బలి అయ్యాడు.

చాలా అరుదుగా మాత్రమే ఇలా పైతాన్ మనుషులను అటాక్ చేస్తుంది:
ఇండోనేసియా, ఫిలిప్ఫైన్స్ దేశాల్లో 20 అడుగులకు పైగా పొడవైన కొండచిలువలు మనుగడ సాగిస్తున్నాయి. అవి సాధారణంగా చిన్న చిన్న జంతువులపై దాడి చేసి తింటుంటాయి. కానీ మనుషులను తినడం అనేది అరుదుగా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆ వ్యక్తి పేరు అక్బర్ సాలిబిరో
సెల్వేసి ద్వీపంలోని పండ్ల తోటలో అక్బర్ పని చెయ్యడానికి వెళ్లి మాయం అయ్యాడు. అక్బర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బందువులు పండ్ల తోటలోకి వెళ్లి పరిశీలించారు. తోటలో కడుపు ఉబ్బిపోయి కదలలేని స్థితిలో కొడచిలువ దర్శనం ఇచ్చింది.

కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు..
ఆదివారం అక్బర్ (25) అనే వ్యక్తి పామాయిల్ తోట నుంచి తిరిగి వస్తుండగా అదృశ్యమయ్యాడు. ఎంత సేపటికి ఇంటికి చేరుకోకపోవడంతో , కుటుంబ సభ్యులు, అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతన్ని వెతికే క్రమంలో
తోటలోకి వెళ్లిన అక్బర్ ను వెతికే క్రమంలో కొండచిలువ ఎమైనా మింగేసిందా అనే అనుమానం అతని కుటుంబ సభ్యులకు వచ్చింది. అంతే స్థానికులు పెద్ద కత్తి తీసుకుని కొండచిలువను నిలువునా చీల్చుకుంటూ వెళ్లారు. చివరికి కొండ చిలువ కడుపులో అక్బర్ శవమై కనిపించాడు.

పైతాన్ పొట్ట చేల్చి అతని శవాన్ని బయటకు తీశారు
కొండచిలువ శరీరంలోని నుంచి అక్బర్ మృతదేహాన్నిబయటకు తీశారు. అక్బర్ శరీరంలోని ఎముకలు నలిగిపోయాయని అతని కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు చెప్పారు. కొండచిలువ శరీరంలో నుంచి అక్బర్ మృతదేహాన్ని బయటకు తీసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
ఒళ్లు గొగుర్లుపొడిచే ఈ వైరల్ వీడియోను
ఒళ్లు గొగుర్లుపొడిచే ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూడాలనుకుంటే వెంటేనే చూసేయండి...



Click it and Unblock the Notifications